రాధాగా మారిపోతున్నావా రాజా

Update: 2017-02-24 03:30 GMT
రాజా అనే వర్డింగ్ టాలీవుడ్ లో చాలా ఫేమస్. ఒకప్పుడు హీరో కేరక్టర్ కు ఉండే ఈ పేరును.. పోసాని నోట పలికిన తర్వాత దాని అర్ధమే మారిపోయింది. అయితే.. టాలీవుడ్ కి లేటెస్ట్ రాజా మాత్రం శర్వానంద్. వరుసగా ఆ పేరుతో సినిమాలు చేసి సక్సెస్ లు సాధించిన శర్వా.. ఇప్పుడు కొత్త సినిమా టైటిల్ గా రాధాను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

శతమానం భవతి మూవీతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సాధించిన శర్వానంద్.. అరుదైన క్లబ్ లోకి ఎంటర్ అయ్యాడు. ఆ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూనే.. మరోవైపు కొత్త సినిమా షూటింగ్ కూడా కానిచ్చేస్తున్నాడు. గతంలో కరుణాకరన్ కు అసిస్టెంట్ గా వర్క్ చేసిన చంద్రమోహన్ దర్శకత్వంలో.. శర్వా కొత్త సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుండగా.. ఈ సినిమాలో శర్వానంద్ ఓ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది.

ఇప్పుడీ సినిమాకు రాధా అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట. ఇదే టైటిల్ పై మారుతి డైరెక్షన్ లో వెంకటేష్ ఓ మూవీ చేయాల్సి ఉంది. కానీ రకరకాల ప్రాబ్లెమ్స్ తో అది ఆగిపోగా.. ఇప్పుడా టైటిల్ తో శర్వానంద్ రాజా వచ్చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకూ కంప్లీట్ అయిపోయిందని టాక్. ఇంత స్పీడ్ గా సినిమా చేయగలగడానికి నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ అందిస్తున్న సహకారమే కారణం అని తెలుస్తోంది. సమ్మర్ లో ఈ మూవీని రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ఆలోచన.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News