పూరి-ఛార్మి డ్యాన్స్ ఇరగదీశారుగా..

Update: 2018-01-21 08:27 GMT
నందమూరి బాలకృష్ణతో తీసిన ‘పైసా వసూల్’ తేడా కొట్టేసినా పూరి జగన్నాథ్ ఏమీ బ్రేక్ తీసుకోలేదు. ఎప్పట్లాగే వెంటనే తన కొత్త సినిమా మొదలుపెట్టేశాడు. ఈసారి తన కొడుకు పూరి ఆకాశ్ ను హీరోగా పరిచయం చేస్తూ ‘మెహబూబా’ అనే సినిమా తీస్తున్నాడు జగన్. ఈ చిత్ర షూటింగ్ గురించి అప్పుడప్పుడూ అప్ డేట్స్ ఇస్తూ ఉంది చిత్ర బృందం. ఇండియాలోని రకరకాల లొకేషన్లలో ఈ చిత్ర షూటింగ్ సాగుతోంది.

తాజాగా ఈ చిత్ర బృందమంతా కలిసి పార్టీ చేసుకుంటున్న వీడియో ఒకటి ఆన్ లైన్లోకి వచ్చింది. పూరి జగన్నాథ్.. ఆయన సన్నిహితురాలు.. ‘మెహబూబా’ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఛార్మి.. ఆకాష్.. హీరోయిన్ నేహా శెట్టి.. మిగతా కాస్ట్ అండ్ క్రూ అంతా కలిసి ఈ పార్టీలో పాల్గొన్నారు. హిందీ పాటలకు లయబద్ధంగా డ్యాన్స్ చేస్తూ అందరూ ఎంజాయ్ చేశారు. ఛార్మి తనదైన శైలిలో డ్యాన్స్ చేయగా.. పూరి సైతం అందరితో పాదం కలిపాడు. పూరి కొడుకే కొంచెం బిడియంతో కనిపించాడు.

ఇక ‘మెహబూబా’ విషయానికి వస్తే 1971 ఇండో-పాక్ యుద్ధం నేపథ్యంలో సాగే లవ్ స్టోరీ ఇది. ఇదొక హైలీ ఇంటెన్స్.. ప్యాషనేట్ లవ్ స్టోరీ అంటూ ప్రారంభోత్సవ సమయంలో చెప్పాడు పూరి. ‘టెంపర్’ మినహాయిస్తే గత దశాబ్ద కాలంలో పూరి నుంచి నిఖార్సయిన హిట్టు లేదు. ఇప్పుడు ఆయనకూ హిట్ అవసరం. అలాగే ఆయన తనయుడు ఆకాశ్ కూ అరంగేట్రంలో మంచి సక్సెస్ కావాలి. మరి ఈసారి పూరి ఎలాంటి సినిమాను అందిస్తాడో చూడాలి.

Full View
Tags:    

Similar News