మరోసారి ఆ దర్శకుడితో ప్రకాష్‌రాజ్‌

Update: 2015-07-04 04:47 GMT
ప్రకాష్‌రాజ్‌కి మరో జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టిన చిత్రం 'కాంచీవరం'. కంచి నేపథ్యంలో నేత కార్మికుడి జీవితం ఆధారంగా రూపొందిన ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. పలు పురస్కారాల్నీ సొంతం చేసుకొంది. ప్రియదర్శన్‌ తెరకెక్కించిన ఆ చిత్రం ఓ కళాఖండంగా మిగిలిపోయింది. ఇప్పుడు అదే కాంబినేషన్లో మరో చిత్రం తెరకెక్కబోతోంది. ఇటీవలే ప్రకాష్‌రాజ్‌ని కలిసిన ప్రియదర్శన్‌ కథని వినిపించాడట. అద్భుతంగా ఉందనీ, కాంచీవరం టీమ్‌ అంతా కలిసి మరో గొప్ప చిత్రం చేయబోతున్నామని ప్రకాష్‌రాజ్‌ వెల్లడించాడు.

 ప్రియదర్శన్‌ ఆమధ్య బాలీవుడ్‌లో వరుస విజయాల్ని సొంతం చేసుకొన్నారు. అయితే కొన్నాళ్లుగా ఆయనకి సరైన హిట్టు లేదు. అందుకే మళ్లీ చిన్న బడ్జెట్‌తో కూడిన ఓ సినిమాని చేసి హిట్టు కొట్టాలనుకొంటున్నాడు. ప్రియదర్శన్‌ ఎప్పుడు ప్రయోగం చేసినా అది గన్‌షాట్‌గా సక్సెస్‌ అవుతుంటుంది. మరోసారి ప్రయోగమే చేసి విజయాన్ని సొంతం చేసుకోవాలనుకొంటున్నాడట. ప్రకాష్‌రాజ్‌కి కూడా 'ఓకే బంగారం' మినహా ఇటీవల కాలంలో నటుడిగా గొప్ప సంతృప్తినిచ్చిన సినిమాలేవీ పడలేదు. ప్రియదర్శన్‌ సినిమాతో మళ్లీ నటనకు ప్రాధాన్యమున్న పాత్ర చేసి అదరగొట్టాలని నిర్ణయించుకొన్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News