మెగా హీరోయిన్నుకి ఇంకోటి చేజారింది

Update: 2016-07-27 06:01 GMT
క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ జంటగా నటించిన కంచె మూవీ తర్వాత హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కి ఆఫర్లు బాగానే వచ్చాయి. కానీ వాటిని నిలబెట్టుకోవడంలో ఈమె విజయం సాధించలేకపోతోంది. పలు క్రేజీ ప్రాజెక్టులకి ఈమెని హీరోయిన్ గా అనుకున్నా.. అవేవీ వర్కవుట్ కాలేదు. రీసెంట్ గా మంచు విష్ణు ప్రాజెక్టు కూడా ఈమె చేజారిందని తెలుస్తోంది.

సత్య దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా తెరకెక్కిస్తున్న మూవీ కోసం ప్రగ్యా జైస్వాల్ ని ఫైనలైజ్ చేశారనే వార్తలొచ్చాయి. ఇప్పుడా సినిమా కోసం వేరే హీరోయిన్ ని వెతుక్కుంటున్నారట. మరి వాళ్లే తప్పించారో.. ఈమె వైదొలగిందో తెలీలేదు కానీ.. ఈ సినిమాలో ప్రగ్యా లేదని మాత్రం తేలిపోయింది. ఈ అమ్మడు యాటిట్యూడ్ చూపించడంలో దిట్ట అనే టాక్ ఉంది. అదే ఈమెకు ఆఫర్లను దూరం చేస్తోందని అంటున్నారు. అందుకే స్టార్ హీరోలే కాదు.. కుర్ర హీరోలు కూడా ఈమెను దూరం పెడుతున్నారట.

ప్రస్తుతం నాగార్జున ప్రధాన పాత్రలో రాఘవేంద్రరావు తెరకెక్కిస్తున్న ఓం నమో వెంకటేశాయ ఒక్కటే ఈమె చేతిలో ఉంది. ఈ లెక్కన ఇంత స్లోగా బండి నడిస్తే.. కెరీర్ గాడిలో పడ్డానికే దశాబ్ద కాలం పట్టేస్తుందని ఈమెకు ఎవరైనా చెబితే బాగుండు!
Tags:    

Similar News