పిక్ టాక్ : ఇష్టమైన తోడు తో పిక్నిక్ కు కీర్తి

Update: 2021-06-20 08:43 GMT
సౌత్ స్టార్‌ హీరోయిన్‌ కీర్తి సురేష్‌ కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా గత కొన్ని వారాలుగా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యింది. కాస్త కేసులు తగ్గడంతో పాటు ప్రభుత్వం లాక్‌ డౌన్‌ ను సడలిస్తూ వస్తున్న కారణంగా సామాన్యుల నుండి సెలబ్రెటీల వరకు అంతా కూడా బయటకు వచ్చేస్తున్నారు. జన జీవనం సాదారణ స్థితికి వస్తుంది. ఈ సమయంలో కీర్తి సురేష్‌ తాను తనకు ఇష్టమైన పర్ఫెక్ట్‌ జత గాడితో పిక్నిక్ కు వెళ్లినట్లుగా పేర్కొంది.

ఈ ఫొటోను షేర్‌ చేసిన కీర్తి సురేష్‌ మంచి వాతావరణం.. ఇష్టమైన తోడు తో బీచ్‌ లో పిక్నిక్‌. ఇంతకు మించి ఏం కావాలంటూ ఆమె కామెంట్‌ పెట్టింది. తనకు ఇష్టమైన పెట్‌ డాగ్‌ తో కీర్తి సురేష్ అలా సముద్ర తీరాన సేద తీరుతూ ఉంది. వచ్చే నెల నుండి షూటింగ్స్ అన్ని కూడా పునః ప్రారంభం కాబోతున్నాయి. కనుక అప్పటి నుండి మళ్లీ కీర్తి సురేష్‌ ఫుల్‌ బిజీ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడే సాధ్యం అయినంత వరకు కీర్తి తన కుటుంబ సభ్యులు మరియు పెట్ డాగ్‌ తో సమయాన్ని గడిపేస్తోంది.

టాలీవుడ్ లో కీర్తి సురేష్‌ ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తుంది. అంతే కాకుండా తమిళంలో పలు పెద్ద హీరోల సినిమా ల్లో కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. సీనియర్‌ స్టార్‌ హీరోలకు జోడీగా కూడా కీర్తి సురేష్ నటించేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. ఇటీవలే నితిన్ తో ఈమె నటించిన రంగ్‌ దే సినిమా విడుదల అయ్యింది. పాజిటివ్ టాక్‌ దక్కించుకున్న ఆ సినిమా తో కీర్తి సురేష్‌ కు మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి. సౌత్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్స్‌ లో ఈమె కూడా ఒకరు అనడంలో సందేహం లేదు.
Tags:    

Similar News