అన్నయ్యను ముందే కలిసిన తమ్ముడు

Update: 2017-08-23 05:56 GMT
టాలీవుడ్లో  మెగా ఫ్యామిలికి ఉన్న అభిమానులు ఒక రేంజులో ఉంటారని తెలిసిందే. అందుకే మెగా హీరోలు కూడా వారి ఫ్యామిలీ నుంచి ఓ సినిమా వస్తుందంటే చాలు ఫ్యామిలీ మొత్తం ఒకే స్టేజిపై కనిపించి అభిమానులకు ఆనందాన్ని ఇస్తారు. కానీ గత కొంత కాలంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ ఫ్యామిలీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. కానీ అన్నయ్య చిరంజీవికి సంబంధించిన ఏదన్నా విషయం అయితే మాత్రం.. పవన్ తప్పకుండా అక్కడ మెరుస్తాడు.

మంగళవారం రోజు.. కేవలం చిరంజీవి బర్త్ డే మాత్రమే కాదు.. ఆయన కెరీర్ లొనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 151వ చిత్రం మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేయగా పవన్ కళ్యాణ్ మిస్ అయ్యాడా అని అందరూ అనుకున్నారు. మరి మెగాస్టార్ కు బర్త్ డే విషెస్ కూడా చెప్పడా అని అందరూ అడిగారు. కానీ పవన్ అసలు నాలుగు రోజుల ముందే చిరంజీవిని కలిశాడట తెలుసా? మొన్నొక రోజున హైదరాబాద్ శివార్లరో వేసిన రంగస్థలం 1985 సెట్లో చరణ్‌ ను కలిశాడట. అక్కడ నుండి చరణ్‌ తో కలసి మెగాస్టార్ దగ్గరకు వెళ్ళారట. అప్పుడే పవన్ అన్నయ్యకు బర్త్ తడే విషెస్ చెప్పగా.. చిరంజీవి కూడా తమ్ముడి సినిమాల గురించి అడిగి తెలుసుకున్నారట. ఇక చరణ్ కూడా బాబాయ్ తో కాసేపు ముచ్చటించాడని తెలుస్తోంది. అలాగే పవన్ కి మూవీ పోస్టర్ ని కూడా ముందుగానే చూపించారని టాక్.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ - చిరంజీవి ఇద్దరు సినిమాల్లో మరియు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఇప్పటికే పవన్ బిజీ అవ్వగా సినిమా మొదలైతే చిరు కూడా చాలా బిజీ అవుతారు. పవన్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
Tags:    

Similar News