గబ్బర్‌ సింగ్‌ 2.. 29మే ముహూర్తం

Update: 2015-05-24 07:30 GMT
పవన్‌కల్యాణ్‌ హీరోగా బాబి దర్శకత్వంలో గబ్బర్‌సింగ్‌ 2 ఎప్పుడు సెట్స్‌కెళుతోంది? ఈ విషయంలో ఇంతకాలం సరైన క్లారిటీ లేనేలేదు. పవన్‌ ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూనే ఉన్నాడు. ఇప్పటికే ప్రాజెక్టులో ఒక దర్శకుడు మారాడు. పలుమార్లు ఇప్పుడు అప్పుడు అంటూ దాటవేస్తూ వచ్చారు. కానీ ఇక గబ్బర్‌ ఆగడని తెలుస్తోంది. ఈనెల 29 నుంచి షూటింగ్‌ మొదలవుతోంది. ఇప్పటికే పలు లొకేషన్ల వేట సాగించారు. పూణే సమీపంలోని ఓ గ్రామంలో వేసిన సెట్‌లో సినిమాని చిత్రీకరించనున్నారు.

ఇక్కడ పోలీస్‌ స్టేషన్‌ సీన్లు, హీరోయిన్‌తో రొమాన్స్‌ సీన్లు తెరకెక్కిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే అనీషా ఆంబ్రోస్‌ని ఒక కథానాయికగా ప్రకటించారు. రెండో నాయిక ఎవరనేది తేలాల్సి ఉంది. అధికారికంగా అన్ని వివరాల్ని పవన్‌ స్వయంగా ప్రకటిస్తారేమో చూడాలి. ఓ వైపు అన్నయ్య సినిమా ఆగస్టులో సెట్స్‌కెళుతోంది కాబట్టి ఈలోగానే తమ్ముడు సెట్స్‌కెళితే బావుంటుందని మెగాభిమానులు సైతం భావిస్తున్నారు. ఈ ఏడాది చివరిలో గబ్బర్‌సింగ్‌ 2, కొత్త సంవత్సరంలో అన్నయ్య సినిమా ఆటోజానీ ఖుషీని ఇస్తాయనేది వారి ప్లాన్‌.


Tags:    

Similar News