స్టార్ సినిమాటోగ్రాఫర్ రెమ్యునరేషన్ తీసుకోలేదట!

Update: 2019-10-16 07:35 GMT
ఓంకార్ దర్శకత్వంలో అశ్విన్ - అవికా గోర్ జంటగా తెరకెక్కిన 'రాజు గారి గది 3' ఈ నెల 18 న థియేటర్స్ లోకి వస్తోంది. ఈ సందర్బంగా మీడియా ముందుకొచ్చిన ఓంకార్ తన తమ్ముళ్ల గురించి చెప్తూ కొంచెం ఎమోషనల్ అయ్యాడు.

ఇటీవలే తన తండ్రి మరణించారని - ఇక తనని సపోర్ట్ చేస్తూ వచ్చిన తమ్ముళ్లను నిలబెట్టడానికి తనే తండ్రిగా మారానని అందుకే తన తెల్లని బట్టలు మాత్రమే వేస్తున్నానని అన్నాడు. ఇక రెండో తమ్ముడు అశ్విన్ ని పూర్తి స్థాయి హీరోగా చూడాలన్న కల ఈ సినిమాతో నెరవేరిందని - తర్వాత చిన్న తమ్ముడు కళ్యాణ్ ని నిర్మాతగా మార్చడం మరో బాధ్యత అని తెలిపాడు.

ఇదే వేదికపై చోటా కే నాయుడు ఇంకా సినిమాకు ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని - తమకి తండ్రి లేని లోటు తీర్చాడని చోటా గురించి చెప్పాడు. ఇక తమన్నా డేట్స్ దొరకని పరిస్థితుల్లో అవికా దేవుడు పంపించినట్టు ప్రాజెక్ట్ లోకి వచ్చిందని సినిమాలో వచ్చే క్లైమాక్స్ లో తన విశ్వరూపం చూస్తారని చెప్పుకొచ్చాడు. సో తమ్ముడి కోసం అన్నయ్య చేసిన ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి


Tags:    

Similar News