నేడే నిశ్చితార్థం.. అయినా నోరు మెదపరే..!

Update: 2023-06-09 14:19 GMT
టాలీవుడ్ లో మరో జంట పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అయ్యింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిలు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. నెట్టింట జరుగుతున్న ప్రచారం మేరకు నేడే వారి నిశ్చితార్థం. ఈ రోజు కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వారి నిశ్చితార్థం జరగనుందట. ఈ ఎంగేజ్మెంట్ రోజే పెళ్లి తేదీని కూడా కన్ఫామ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే, ఏ సెలబ్రెట కపుల్ అయినా తమ ప్రేమ, పెళ్లి వంటి విషయాలను అంత తొందరగా ఎవరితోనూ పంచుకోవు. చాలా సీక్రెట్ మెయింటైన్ చేస్తారు. ఈ జంట కూడా అదే చేశారు. అయితే, కనీసం ఎంగేజ్మెంట్ దగ్గరపడినప్పుడైనా అభిమానులతో ఈ విషయాన్ని షేర్ చేసుకుంటారు. కానీ, వరుణ్, లావణ్యలు మాత్రం ఈ విషయంలో భిన్నంగా ప్రవర్తిస్తున్నారు.

 ఈ రోజే వారి ఎంగేజ్మెంట్ అయినప్పటికీ, ఆ విషయాన్ని వారు బయటకు పంచుకోకపోవడం గమనార్హం. కనీసం సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం కానీ, లేదంటే ఏదైనా హింట్ ఇవ్వడం లాంటివి కూడా వారు చేయకపోవడం విశేషం. మరి ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత అయినా, ఈ విషయాన్ని ప్రకటిస్తారో లేదో చూడాలి.

ఇదిలా ఉండగా, నేడు జరుగుతున్న వారి ఎంగేజ్మెంట్ ఫంక్షన్ లో మెగా ఫ్యామిలీ హీరోలు అందరూ పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. పవన్ కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. పెళ్లి కూడా త్వరలోనే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాగా, వరుణ్, లావణ్యలకు  మిస్టర్ మూవీ సమయంలో పరిచయం ఏర్పడింది. 2017లొ  తెరకెక్కిన ఈ సినిమాకి శ్రీనువైట్ల దర్శకత్వం వహించారు. ఈ మూవీ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది. ఆ మూవీ హిట్ కాకపోయినా, వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడం విశేషం. ఆ తర్వాత అంతరిక్షంలోనూ వీరిద్దరూ జంటగా కనిపించారు. ఇక లావణ్య ఉత్తరప్రదేశ్ కి చెందిన యువతి కాగా, అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.

ప్రస్తుతం వరుణ్ తేజ్ రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి... ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'గాంఢీవదారి అర్జున'. మరొకటి... ఏవియేషన్ థ్రిల్లర్. దానిని సోనీ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం బుడాపెస్ట్ సిటీలో ప్రవీణ్ సత్తారు యాక్షన్ థ్రిల్లర్ సినిమా షూటింగ్ చేస్తున్నారు.

Similar News