ట్రైలర్ టాక్: అసక్తి రేకెత్తిస్తున్న నవాబ్

Update: 2018-09-22 08:07 GMT
సీనియర్ ఫిలిం మేకర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన 'నవాబ్' సెకండ్ ట్రైలర్ ఈరోజే రిలీజ్ అయింది.  మొదటి ట్రైలర్ లో   భూపతి రెడ్డి(ప్రకాష్ రాజ్) అనే  పవర్ఫుల్ క్యారెక్టర్ ను అయన ఫ్యామిలీ ని చూపించారు.. ఆయనకు కొడుకులుగా అరవింద్ స్వామి.. అరుణ్ విజయ్..  శింబు లను పరిచయం చేశారు.  శింబు అంటే పెద్దాయనకు ఇష్టం లేదని శింబు డైలాగ్ ద్వారా చెప్పించారు.  ఆధిపత్యం కోసం ఒక పవర్ ఫుల్ ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య జరిగే పోరాటం అని ఈ ట్రైలర్ లో హింట్ ఇచ్చారు.

ఇక తాజా ట్రైలర్ విషయానికి వస్తే.. పెద్దాయన చనిపోయినట్టు దాంతో అరవింద్ స్వామి అయన సామ్రాజ్యానికి వారసుడిగా ఉండేందుకు రెడీ కావడం.. పెద్దాయన మరణంపై శింబు కు డౌట్ రావడం ఇక అన్నదమ్ముల మధ్య యుద్ధం మొదలు కావడం లాంటివి ఉన్నాయి. మొత్తం ప్లాట్ రివీల్ చేయలేదు గానీ ఇదొక గ్యాంగ్ స్టర్ వార్ డ్రామా అన్నవిషయం మణి సార్ క్లియర్ గా ఈ ట్రైలర్ తో చెప్పాడు.  విజయ్ సేతుపతి అరవింద్ స్వామి ను వెంటాడుతున్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. సంతోష్ శివన్ విజువల్స్.. రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెండూ టాప్ క్లాస్.

 ఇక 'నాయకుడు.. 'దళపతి' లాంటి క్లాసిక్ గ్యాంగ్ స్టర్ డ్రామాలకు కేరాఫ్ అడ్రెస్ మణి సార్.  ఈ సినిమాలో స్టార్ట్ కాస్ట్ అంతా బ్రిలియంట్ యాక్టర్స్ కాబట్టి అలాంటి మరో గ్యాంగ్ స్టర్ డ్రామా.. హై స్టాండర్డ్ నటన ను ఆశించవచ్చు. ఈ ట్రైలర్ తో సినిమాపై మణి సార్ ఆసక్తిని పెరిగేలా చేశాడు. అంతా బాగుంది గానీ ఇవి ట్రైలర్ ల వరకేనా లేదా స్టొరీ - స్క్రీన్ ప్లేలో కూడా కొత్తదనం ఉందా అనేది సెప్టెంబర్ 27 న తెలుస్తుంది.

వీడియో కోసం క్లిక్ చేయండి


Full View


Tags:    

Similar News