చైతుతో మల్టీస్టారర్.. నాగ్ కి కూడా న్యూసే!

Update: 2017-01-19 05:32 GMT
టాలీవుడ్ లో రాబోయే ప్రాజెక్టులపై చాలా న్యూసే వచ్చేస్తుంటాయి. అందులో అన్నిటికంటే క్రేజీగా వినిపించిన న్యూస్.. అక్కినేని నాగార్జున-నాగచైతన్యలు మరోసారి కలిసి నటించబోతున్నారు అనే. మనం లాంటి బ్లాక్ బస్టర్ సాధించిన ఈ కాంబో.. మళ్లీ అదే మ్యాజిక్ రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారని టాక్ వచ్చింది.

అయితే.. ఈ వార్తలన్నీ పుకార్లే అన్ని ఒక్క ట్వీట్ తో తేల్చేశాడు నాగార్జు. 'నేను చై కలిసి మరో సినిమా చేయబోతున్నామనే వార్తలు చదువుతున్నాను.. వింటున్నాను కూడా. ఇది నాకు కూడా కొత్త వార్తే' అనేశాడు నాగ్. ఈ ఒక్క ట్వీట్ చాలు.. నాగార్జున- నాగచైతన్యల కాంబినేషన్ పై ఇప్పటివరకూ వచ్చినవన్నీ రూమర్సే అని చెప్పడానికి. తండ్రీ కొడుకులు ఇద్దరితో కలిపి దిల్ రాజు సినిమా ప్లాన్ చేశాడనే టాక్ గట్టిగానే వినిపించింది.

శతమానం భవతి అంటూ మంచి ఫ్యామిలీ ఎంటర్టెయినర్ అందించిన దర్శకుడు సతీశ్ వేగేశ్న నాగ్-చైతుల కాంబోలో సినిమా చేయనున్నాడనే రూమర్లు చక్కర్లు కొట్టాయి. కానీ ఒకే ఒక్క ట్వీట్ తో నాగ్ ఇవన్నీపుకార్లు అని తేల్చేయడంతో.. అక్కినేని అభిమానులు కొంత నిరుత్సాహపడ్డారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News