పంద్రాగస్టు వేళ.. వరుస అనౌన్స్ మెంట్లతో టాలీవుడ్ బిజీబిజీ

Update: 2021-08-16 03:21 GMT
కొవిడ్ కారణంగా తీవ్రంగా ప్రభావితమైన రంగాల్లో వినోదరంగం ఒకటి. అందునా సినిమా పరిశ్రమకు షాకులు బోలెడన్ని తగిలాయి. ఒకటి తర్వాత ఒకటిగా విరుచుకుపడిన మొదటి.. రెండో వేవ్ నుంచి ఇంకా ఈ రంగం పూర్తిగా కోలుకున్నది లేదు. తెలంగాణలో ఫర్లేదు కానీ.. ఏపీలో ఇప్పటికి థియేటర్లుఓపెన్ కాని పరిస్థితి. విడుదలకు సినిమాలు రెడీగా ఉన్నప్పటికీ వాటిని బయటకు తీసుకురాలేక కిందామీదా పడిపోతున్నారు నిర్మాతలు. రోడ్లు అన్ని కిక్కిరిసిపోయి.. మార్కెట్లు కళకళలాడిపోతున్న వేళ.. మాయదారి రోగమంతా థియేటర్లకు.. సినిమా ఇండస్ట్రీకేనా? అన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఈ మధ్యనే కొన్ని థియేటరలు తెరుచుకోవటం.. వరుస పెట్టి సినిమాలు విడుదలవుతూ వాతావారణం సానుకూలంగా ఉందన్న అంచనాలు వెలువడుతున్న వేళ.. వచ్చిన పంద్రాగస్టు సందర్భంలో టాలీవుడ్ లో బోలెడన్ని అప్డేట్స్ వెల్లడయ్యాయి. కొత్త సినిమాల్ని ప్రకటించేవారు.. తమ సినిమాలకు కొత్త పోస్టర్లు విడుదల చేసే వారే కాదు.. ఇదే ఊపులో తమ సినిమాలకు కొత్త డేట్లను డిసైడ్ చేసేసి పోస్టర్లను బయటకు తెచ్చేసినోళ్లు ఉన్నారు. ఇటీవల కాలంలో ఇన్ని అప్డేట్స్ ఒకరోజులో చోటు చేసుకోలేదని చెప్పాలి. ఇంతకీ అవేమంటే..
Read more!

-  టాలీవుడ్ లో తనదైన నటనతో అందరి మనసుల్ని గెలుచుకున్న సత్యదేవ్ నటించిన హిందీ మూవీ ‘హబీబ్’. ఈ సినిమాతో బాలీవుడ్ కు పరిచయమవుతున్నాడు.  కొడుకు కోసం ఆఫ్ఘనిస్తాన్‌ వెళ్లిన ఓ ఆర్మీ ఆఫీసర్‌ కథే ఈ మూవీ. ఈ మూవీకి సంబంధించిన పాటను తాజాగా విడుదల చేశారు.

-  హిందీ హిట్‌ ‘అంధాధున్‌’ తెలుగులో ‘మ్యాస్ట్రో’గా రీమేక్‌  అవుతోంది. నితిన్.. నభా నటేష్ జంటగా తమన్నాప్రధాన పాత్రను పోషిస్తున్న ఈ చిత్రం కొత్త పోస్టర్ విడుదలైంది.

-  నాగశౌర్య నటిస్తున్న ‘లక్ష్య’ చిత్రం కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో నాగశౌర్య విలుకాడిలా కనిపించనున్నారు.

-  సుధీర్ బాబు నటించిన ‘శ్రీదేవి సోడా సెంటర్’.. సుశాంత్ నటించిన ‘ఇచట వాహనములు నిలుపురాదు’ కొత్త పోస్టర్లు బయటకు వచ్చాయి.

-  సునీల్.. ధనరాజ్ హీరోలుగా నటిస్తున్న ‘‘బుజ్జి.. ఇలారా’’ ఫస్ట్ లుక్ విడులైంది.

- నవీన్ చంద్ర నటిస్తున్న ‘‘1997’’ మూవీలో నవీన్ లుక్ ను విడుదలైంది

-  దివంగత శ్రీహరి కుమారుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా పరిచయమవుతున్న మూవీని సి. కల్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ‘రాసి పెట్టుకుంటే’ అనే టైటిల్ ను డిసైడ్ చేశారు.
4

-  వంగవీటి.. జార్జిరెడ్డి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సందీప్ మాధవ్ హీరోగా నటిస్తున్న ‘గంధర్వ’ ఫస్ట్ లుక్.. మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.

-  సింధూరపువ్వు రాంఖీ.. హర్షిత్ రెడ్డి తదితరులు నటిస్తున్న ‘గగనవీధి’ మూవీ ఫస్ట్ లుక్ ను లాంచ్ చేశారు.

-  ‘1948: అఖండ భారత్‌’ సినిమా పోస్టర్.. లిరికల్ వీడియో విడుదలైంది.  ‘ది మర్డర్‌ ఆఫ్‌ మహాత్మాగాంధీ’ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్.

-  దేవ కట్టా దర్శకత్వంలో  సాయి ధరమ్ తేజ్ కలెక్టర్ గా నటించిన ‘రిపబ్లిక్’ మూవీ డేట్ ను డిసైడ్ చేశారు. గాంధీ జయంతి సందర్భంగా ఒక రోజు ముందు అంటే అక్టోబరు 1న ఈ మూవీని విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడైంది.

- గొడవలంటే భయపడే ఒక అబ్బాయి.. ఒక అమ్మాయి  ప్రేమ కోసం ‘గల్లీ రౌడీ’గా మారిన సందీప్ కిషన్ చిత్రం అక్టోబరు 3న విడుదల చేసేందుకు డిసైడ్ చేశారు.

-  తన కెరీర్ లో తొలిసారి గూఢచారి అవతారాన్ని ఎత్తనున్నారు నిఖిల్. ఎవరు.. గూఢచారి చిత్రాలకు ఎడిటర్ గా పని చేసిన గ్యారీ బి.హెచ్ ఈ స్పెథ్రిల్లర్ తో దర్శకుడిగా కొత్త అవతారాన్ని ఎత్తనున్నారు.

-  ఆది సాయి కుమార్ తాజా చిత్రాన్ని షురూ చేశారు. ఇందులో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నిర్ణయించారు.
Tags:    

Similar News