రష్మికపై మండిపడుతున్న మహేష్ ఫ్యాన్స్

Update: 2019-10-12 06:47 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు - అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకేక్కుతునన్ చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'.  ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.  రీసెంట్ గా రష్మిక చేసిన ఒక పని మహేష్ అభిమానులకు కోపం తెప్పించింది. కారణం 'సరిలేరు నీకెవ్వరు' పోస్టర్ లో టాగ్స్ ను జోడించకపోవడం.

ఇంతకీ ఏం జరిగిందంటే దసరా సందర్భంగా అభిమానులకు కానుకగా 'సరిలేరు నీకెవ్వరు' టీమ్ ఒక పవర్ ఫుల్ పోస్టర్ ను విడుదల చేశారు.  ఈ పోస్టర్ లో కొండారెడ్డి బురుజు దగ్గర మహేష్ ఇంటెన్స్ లుక్ ఇస్తూ నిలబడ్డారు. ఈ పోస్టర్ ను అనిల్ రావిపూడి తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ "సూపర్ స్టార్ మహేష్ గారితో ఆయుధపూజ" అని మొదలు పెట్టి సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతోందని.. అందరికీ దసరా శుభాకాంక్షలు తెలుపుతూ మహేష్.. రష్మిక.. విజయశాంతి.. దేవీశ్రీప్రసాద్.. రత్నవేలు.. అనిల్ సుంకర లను టాగ్ చేశారు.  ఈ ట్వీట్ ను రీట్వీట్ చేసిన రష్మిక జస్ట్ "హ్యపీ దసరా" అంటూ రెండు ఎమోజిలను మాత్రం జోడించింది.

దీంతో ఫ్యాన్స్ కు చిర్రెత్తుకొచ్చింది.  కనీసం సినిమా పేరును కూడా టాగ్ చేయడం తెలియదా? మహేష్ బాబు ట్విట్టర్ ఐడీ టాగ్ ఎక్కడ? అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.  అంతే కాదు.. పోస్టర్ రిలీజ్ అయిన వెంటనే ట్వీట్ చేయకుండా ఎందుకు లేట్ చేశావు? అంటూ ప్రశ్నించారు. "ఇప్పుడే లేచావా నువ్వు.. మా ఖర్మ నువ్వు హీరోయిన్" అంటూ మరొకరు ఆగ్రహం ప్రదర్శించారు.  ఇంకో ఫ్యాన్ "నిన్ను మా అన్న పక్కన ఎలా భరించాలో" అంటూ చిరాకుపడ్డాడు.

ఫ్యాన్స్ ఆగ్రహంలో కూడా కొంత వాస్తవం ఉంది.  ఒక సినిమాకు ప్రమోషన్స్ చాలా ముఖ్యం.  ముఖ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే సమయంలో టాగ్స్ వాడాలి.  సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉండే రష్మిక మహేష్ సినిమా విషయంలో ఇలా ఎందుకు చేసిందో.. ఆల్రెడీ అనిల్ టాగ్స్ ఇచ్చాడు కదా.. మరోసారి నేను టాగ్ చేయడం ఎందుకని అనుకుందేమో. ఏదేమైనా రష్మిక ఇలానే కంటిన్యూ అయితే మహేష్ ఫ్యాన్స్ ఈసారి మరింత తీవ్రంగా ట్రోలింగ్ చేయడం ఖాయం.
Tags:    

Similar News