ఇక వియత్నాం అంటున్న మహేష్

Update: 2017-03-22 07:51 GMT
తక్కువలో తక్కువ ఇప్పటిదాకా పది షెడ్యూళ్లయినా అయి ఉంటాయి మహేష్ బాబు కొత్త సినిమాకు. చెన్నై అంటారు.. హైదరాబాద్ అంటారు.. అహ్మదాబాద్ అంటారు.. ఇలా దేశంలో చాలా చోట్ల తిరిగారు. చాలా షెడ్యూళ్లు అవగొట్టారు. ఇప్పుడిక వియత్నాం బయల్దేరుతోంది చిత్ర యూనిట్. అక్కడ మహేష్-విలన్ గ్యాంగ్ మధ్య భారీ యాక్షన్ సీక్వెన్స్ తీయబోతున్నరాట. గురువారం హైదరాబాద్ నుంచి వియత్నాం బయల్దేరుతున్న చిత్ర యూనిట్ దాదాపు పది రోజుల పాటు షూటింగ్ చేసిన అనంతరం ఇండియాకు బయల్దేరుతుందని సమాచారం.

నిజానికి ఈ షెడ్యూల్ ఎప్పుడో జనవరిలో చేయాల్సింది. ఆ నెలలోనే షూటింగ్ కూడా పూర్తి కావాల్సింది. కానీ షెడ్యూళ్లు అనుకున్నట్లుగా అవ్వకపోవడంతో ఇంకా షూటింగ్ కొనసాగుతూనే ఉంది. ఐతే ఏప్రిల్ మధ్యలో సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉన్నాడు మురుగదాస్. కొరటాల దర్శకత్వంలో మహేష్ చేయాల్సిన కొత్త సినిమా మేలోనే మొదలుపెట్టాల్సి ఉన్న నేపథ్యంలో మురుగ సినిమా షూటింగ్ ఏప్రిల్ ను దాటి వెళ్లకపోవచ్చు. రూ.100 కోట్లకు పైగా బడ్జెట్లో తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోంది మహేష్-మురుగదాస్ మూవీ. ఇందులో మహేష్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ పాత్రను చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఉగాదికి ఈ చిత్ర టైటిల్.. ఫస్ట్ లుక్ ఒకేసారి ప్రేక్షకులకు చూపించే అవకాశముంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News