ఎన్టీఆర్ సినిమాలో అందుకే నటించలేదు!

Update: 2019-02-19 02:30 GMT
ఓ పదిహేనేళ్ళ క్రితం హీరోయిన్ గా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన హీరోయిన్ లయ అప్పటి ఆడియన్స్ కు అభిమాన నటే.   ఎందుకంటే అప్పట్లో కూడా టాలీవుడ్ హీరోయిన్లందరూ దాదాపుగా ఇంపోర్ట్ కేటగిరీనే.  లయ మాత్రం అచ్చ తెలుగు హీరోయిన్.  బాలయ్య.. శ్రీకాంత్..వేణు.. శివాజీ లాంటి హీరోల సినిమాలో నటించింది లయ. 2006 లో వివాహం చేసుకున్న తర్వాత భర్తతో పాటు అమెరికాకు వెళ్లి సెటిల్ అయింది.

ఆ తర్వాత నటనకు దూరంగానే ఉంది కానీ మధ్యలో 'బ్రహ్మలోకం టూ యమలోకం వయా భూలోకం'  అనే సినిమాలో మాత్రం నటించింది.  రీసెంట్ గా 'అమర్ అక్బర్ అంటోనీ' చిత్రలో ఒక చిన్న పాత్రలో నటించి రీ-ఎంట్రీ ఇచ్చింది. ఈమధ్య ఒక ఇంటర్వ్యూ లో పూర్తిస్థాయి పాత్రలలో నటించడానికి సిద్ధమని ప్రకటించింది లయ.   పెళ్లి తర్వాత పిల్లలు.. ఇతర కుటుంబ బాధ్యతలతో నటనకు దూరంగా ఉన్నానని.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కు సిద్ధంగా ఉన్నానని తెలిపింది.  

పోయిన సంవత్సరం జూనియర్ ఎన్టీఆర్ సినిమా 'అరవింద సమేత' లో నటించే అవకాశం వచ్చిందని.. కానీ తన వయసుకు మించిన పాత్ర అనిపించడంతో ఆ ఆఫర్ ను వదులుకున్నానని తెలిపింది.  తానింకా యంగ్ గా కనిపిస్తున్నానని కొందరు దర్శకులు అంటున్నారని.. అందుకే తల్లి.. వదిన పాత్రలు చేసే వయసు రాలేదని చెప్పింది.  అలాంటి పాత్రలలో నటించేందుకు మరి కొంత సమయం కావాలని తెలిపింది.  తనపై గతంలో కారు ప్రమాదానికి గురయ్యానని సోషల్ మీడియాలో వచ్చిన రూమర్లగురించి ప్రస్తావిస్తూ.. తనెక్కడో అమెరికాలో ఉంటే ఇక్కడ రూమర్లు రావడం ఆశ్చర్యం కలిగించిందని చెప్పింది.
    

Tags:    

Similar News