ట్విస్ట్: బాలయ్య బాబు కోసం ఆడ విలన్!

Update: 2019-05-10 11:38 GMT
నందమూరి బాలకృష్ణ కొత్త సినిమాకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. సీనియర్ తమిళ దర్శకుడు కెయస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య రెండోసారి నటిస్తున్నారు.  'జైసింహా' వీరిద్దరి కాంబినేషన్లోనే తెరకెక్కిన విషయం తెలిసిందే. సీనియర్ నిర్మాత సి. కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ సినిమాను మరో వారంలో అంటే.. మే 17 న లాంచ్ చేస్తారని సమాచారం.

ఈ సినిమాలో విలన్ పాత్రకు ఇప్పటికే జగపతిబాబును తీసుకున్నారు.  బాలయ్య సినిమా 'లెజెండ్' లోనే జగపతి బాబు మొదటిసారి విలన్ గా నటించిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు మరోసారి బాలయ్యతో జగపతి బాబు ఫైట్ చేయనున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి తాజాగా మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.  ఈ సినిమాలో జగపతి బాబు కాకుండా మరో లేడీ విలన్ పాత్ర కూడా ఉందట. ఆ పాత్రకు తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ను ఎంపిక చేశారట.  

సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తె అయిన వరలక్ష్మి మొదట హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా పెద్దగా సక్సెస్ కాలేదు.  కానీ ఈమధ్య లేడీ విలన్ పాత్రలు పోషిస్తూ తమిళనాట సంచలనం సృష్టిస్తోంది.  ధనుష్ సినిమా 'మారి 2' లో.. విశాల్ సినిమా 'పందెం కోడి 2' లో నెగెటివ్ రోల్స్ చేసి మెప్పించింది. రీసెంట్ గా మురుగదాస్ సినిమా 'సర్కార్' లో స్టార్ హీరో విజయ్ తో పోటీ పడి మెప్పించింది.  సో.. విలన్ రోల్స్ వరలక్ష్మికి కొట్టినపిండే.   
Read more!

అయితే ఒకటే చిక్కు ఏంటంటే బాలయ్య కు లేడీ విలన్స్ అచ్చిరాలేదు.  గతంలో 'పలనాటి బ్రహ్మనాయుడు'.. 'సీమసింహం' సినిమాల్లో లేడీ విలన్లతో ఢీ కొట్టాడు బాలయ్య.  అయితే  ఆ సినిమాలు విజయం సాధించలేదు.  మరి ఆ నెగటివ్ సెంటిమెంట్ ను బాలయ్య బ్రేక్ చేసి రజనీకాంత్ 'నరసింహ' స్టైల్లో విజయం సాధిస్తాడేమో వేచి చూడాలి. ఏదేమైనా కెయస్ మామూలోడు కాదు..  బాలయ్యకు కత్తిలాంటి లేడీ విలన్ ను ఫిక్స్ చేసి.. సినిమాపై ఒక్కసారిగా ఆసక్తి పెంచాడు!
    

Tags:    

Similar News