చెర్రీ సినిమాకి దిష్టి తగులుద్దని..!

Update: 2015-06-29 04:24 GMT
తాను చేసే సినిమాలకి సంబంధించిన విషయాల్ని ఎప్పటికప్పుడు బయట పెడుతుంటాడు స్టార్‌ రైటర్‌ కోన వెంకట్‌. ఆ సినిమా వెనక ఆసక్తికరమైన సంగతుల్ని పంచుకొంటూ హైప్‌ క్రియేట్‌ చేస్తుంటాడు. తాజాగా రామ్‌చరణ్‌ సినిమా గురించి ఆయన ట్వీట్‌ చేశాడు.  'చెర్రీ సినిమాకి సంబంధించి చాలా చాలా మంచి విషయాలు చోటు చేసుకొన్నాయి. దిష్టి తగులుతుందని ఏమీ చెప్పడం లేదు' అని ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు. కోన ట్వీట్‌ చూసినప్పట్నుంచి అభిమానులు సినిమా గురించి మరింత ఎక్సైట్‌ అవుతున్నారు. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న చెర్రీ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది.

 క్రేజీ కాంబినేషన్‌గా గుర్తింపు తెచ్చుకొన్న శ్రీనువైట్ల, కోన అండ్‌ టీమ్‌ మధ్య  'బాద్‌షా' సినిమా సమయంలో విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో ఎవరికి వారే అన్నట్టుగా వేర్వేరుగా సినిమాలు చేశారు. 'ఆగడు' శ్రీనువైట్ల సొంతంగానే చేశాడు. కానీ ఆ సినిమా అనుకొన్నస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. రామ్‌చరణ్‌ తన సినిమాతో మళ్లీ శ్రీనువైట్ల, కోన అండ్‌ టీమ్‌ని కలిపారు. ఒకప్పటి మిత్రులు మళ్లీ కలిసి సినిమా చేస్తుండటంతో పరిశ్రమలో అంచనాలు పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా తెరకెక్కుతోందని సమాచారం. చెర్రీ ఈ చిత్రంలో ఓ ఫైట్‌మాస్టర్‌గా కనిపించబోతున్నారు. పోలీసు గెటప్‌లోనూ దర్శనమిస్తాడని తెలుస్తోంది. ఇందులో చెర్రీ సరసన రకుల్‌ ప్రీత్‌సింగ్‌ నటిస్తోంది.

Tags:    

Similar News