షాక్‌: మేనేజ‌ర్ తో బంధం తెంచుకున్న కింగ్ ఫిలింమేక‌ర్

Update: 2020-12-16 13:30 GMT
ఒక్కోసారి ఊహించ‌ని గొడ‌వ‌లు ఏళ్ల త‌ర‌బ‌డి ఉన్న స్నేహాన్ని క‌ట్ చేసుకునేందుకు కార‌ణ‌మ‌వుతాయి. ఇప్పుడు అదే త‌ర‌హాలో బాలీవుడ్ కింగ్ ఫిలింమేక‌ర్ క‌ర‌ణ్ జోహార్ త‌న మేనేజ‌ర్ కి క‌టీఫ్ చెప్పేయ‌డం హాట్ టాపిక్ గా మారింది.

బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్.. ప్రముఖ సెలబ్రిటీ మేనేజర్ రేష్మా శెట్టి చాలాకాలంగా చ‌క్క‌ని వృత్తిప‌ర‌మైన‌ రిలేష‌న్  ని క‌లిగి ఉన్నారు. వారిద్దరూ చాలా కాలంగా పరిశ్రమలో ఎంతో గొప్ప‌ స్నేహితులు అని చెబుతారు.

అయితే ఇటీవల జరిగిన పార్టీలో కరణ్ - రేష్మా మ‌ధ్య ఏం జ‌రిగిందో కానీ ఆ ఇద్దరూ మాటామంతీ లేకుండా విడిపోయారు. కరణ్ జోహార్ - రేష్మా శెట్టిల మధ్య జరిగిన మాటల యుద్ధాన్ని చూసి పార్టీకి హాజరైన అతిథులు బిగ్ షాక్ అయ్యారని సోర్సెస్ ధృవీకరిస్తున్నాయి.

కారణం ఏమైనప్పటికీ బాలీవుడ్ లో దీర్ఘకాలంగా ఉన్న స్నేహాలలో ఒకటి ముగిసింది. రేష్మ‌కు చెందిన మ్యాట్రిక్స్ కాంట్రాక్టుల‌న్నీ క్యాన్సిల్ చేసిన క‌ర‌ణ్ జోహార్ వేరొక ట్యాలెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ `కార్న‌ర్ స్టోన్‌`కి బ‌ద‌లాయించార‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News