జగన్ సర్కార్ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: జబర్ధస్త్ నటుడి డిమాండ్

Update: 2022-01-23 10:30 GMT
ఏపీలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన చింతామణి నాటకంపై ప్రభుత్వం నిషేధం విధించడాన్ని కళాకారులు, తెలుగు భాషా ప్రేమికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు విశాఖలోని మద్దిలపాలెం జంక్షన్ లో తెలుగు తల్లి విగ్రహం వద్ద కళాకారులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో జబర్ధస్త్ నటుడు అప్పారావు కూడా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో జబర్ధస్త్ నటుడు అప్పారావు మాట్లాడారు. చింతామణి నాటకంపై ఏపీ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

1920లో మహాకవి కాళ్ళకూరి నారాయణరావు గారు ఈ నాటకాన్ని రాశారని.. మొదటిసారి ఆ నాటకంలో కాళ్లకూరి నారాయణరావు గారు నటించారని అప్పారావు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చాలా బాధాకరమని.. ఈ ప్రభుత్వం సంఘీభావంతో కూడిన మీటింగ్ పెట్టి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.

కళాకారులను, కళలను ప్రోత్సహించే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తాను ఆకాంక్షిస్తున్నట్టు అప్పారావు ఆశాభావం వ్యక్తం చేశారు.
Tags:    

Similar News