బాలయ్య కోసం కొత్తగా ట్రై చేస్తా

Update: 2019-07-16 05:04 GMT
డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ ఈమద్య కాలంలో ఫామ్‌ కోల్పోయి తంటాలు పడుతున్నాడు. టెంపర్‌ తర్వాత పూరికి మంచి సక్సెస్‌ పడింది లేదు. ప్రస్తుతం ఈయన రామ్‌ తో తెరకెక్కించిన 'ఇస్మార్ట్‌ శంకర్‌' చిత్రాన్ని విడుదల చేసే పనిలో ఉన్నాడు. ఈనెల 18న ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్ర ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉంది. ఇక ఈ చిత్రం ఫలితంపై పూరి భవితవ్యం ఆధారపడి ఉంది. పూరి తర్వాత సినిమాను బాలకృష్ణతో చేయాలని భావిస్తున్నాడు. ఈ సినిమా ఫలితాన్ని బట్టి బాలయ్య నిర్ణయించుకునే అవకాశం ఉంది.

ఇప్పటికే బాలకృష్ణతో 'పైసా వసూల్‌' చిత్రంను పూరి చేశాడు. ఆ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది. అయితే ఆ సమయంలోనే పూరితో మరో సినిమాను చేసేందుకు బాలయ్య ఓకే చెప్పాడు. పూరి వర్కింగ్‌ స్టైల్‌ నచ్చిన బాలయ్య తప్పకుండా మరో సినిమా చేద్దామంటూ హామీ ఇచ్చాడట. దాంతో పూరి ఇస్మార్ట్‌ శంకర్‌ తర్వాత బాలయ్యతోనే సినిమా చేయాలని ఉవ్విల్లూరుతున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశాడు.

ఒక మంచి కథ రాసుకుని బాలకృష్ణ వద్దకు వెళ్లాలి. ఆయనకు తగిన కథకు కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం నా వద్ద ఉన్న కథలు అన్ని కూడా ఆయన టచ్‌ చేసినవే. ఏ సబ్జెక్ట్‌ తీసినా కూడా ఆయన గతంలోనే రెండు మూడు సినిమాల్లో చేసి ఉంటున్నారు. అందుకే ఆయన ఇప్పటి వరకు చేయని సబ్జెక్ట్‌ ను చేయించాలని భావిస్తున్నాను. బాలయ్య కోసం కొత్తగా ట్రై చేయాలి. కథ రాసుకున్న వెంటనే ఆయన వద్దకు వెళ్లిపోతాను. మంచి కథతో ఆయనతో సినిమా చేయాలని ఆశ పడుతున్నట్లుగా పూరి పేర్కొన్నాడు.

Tags:    

Similar News