మూడు సినిమాలు లాక్ చేసిన యాక్షన్ హీరో

Update: 2018-11-11 10:13 GMT
యాక్షన్ హీరో గోపిచంద్ ను కొంతకాలంగా పరాజయాలు వెంటాడుతున్నాయి. 'గౌతమ్ నందా'.. 'ఆక్సిజెన్'.. 'ఆరడుగుల బుల్లెట్'.. 'పంతం' ఇలా ఉంది ఆ ఫ్లాపుల వరస. దీంతో తన నెక్స్ట్ సినిమాకు కాస్త గ్యాప్ తీసుకున్న గోపీచంద్ ఒకేసారి మూడు ప్రాజెక్టులను లైన్లో పెట్టాడట.  అందులో ఇద్దరు తెలుగు డైరెక్టర్లు ఒక తమిళ దర్శకుడు ఉండడం విశేషం.

దర్శకుడు సంపత్ నందాకు ఒక యాక్షన్ ఎంటర్టైనర్ కోసం గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.  సంపత్ - గోపీచంద్ గతంలో 'గౌతమ్ నందా' కు కలిసి పనిచేసిన విషయం తెలిసిందే.  ఇక మరో సినిమా శ్రీవాస్ డైరెక్షన్లో ఉంటుంది.  గోపీచంద్ తో శ్రీవాస్ చేసిన రెండు సినిమాలు 'లక్ష్యం'.. 'లౌక్యం' రెండూ హిట్లే. తాజా చిత్రం ఇద్దరికీ హ్యాట్రిక్ సినిమా అవుతుంది.  ఇక మూడో సినిమా ఎవరితో అంటే తమిళ దర్శకుడు తిరు. ఈ డైరెక్టర్ గతంలో విశాల్ తో రెండు సినిమాలు చేశాడు. ఆ రెండు సినిమాలు 'వేటాడు వెంటాడు'.. 'ఇంద్రుడు'. రీసెంట్ గా తిరు వినిపించిన కథ నచ్చడంతో గోపీచంద్ వెంటనే పచ్చజెండా ఊపాడట.  

ఈ మూడు సినిమాల్లో ఏది మొదట సెట్స్ పైకి వెళ్తుందనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు.  ఎవరైనా వరస ఫ్లాపులు వచ్చినప్పుడు స్లో అవుతారు. కానీ గోపీచంద్ మాత్రం జోరు పెంచడం ఆశ్చర్యమే. మరి ఈ సినిమాలతో అయినా గోపీ మళ్ళీ హిట్ ట్రాక్ కి వస్తాడో లేదో వేచి చూడాలి.
Tags:    

Similar News