`బాహుబలి` తరువాత భారతీయ సినిమాకు అందులో మరీ ముఖ్యంగా టాలీవుడ్ సినిమాకు హద్దులు చెరిగిపోయాయి. ఒకప్పుడు బాలీవుడ్ సినిమా కోసం మన వాళ్లు ఎదురుచూస్తే ఇప్పుడు మన వాళ్ల సినిమాల కోసం బాలీవుడ్ స్టార్స్.. మేకర్స్ ఎదురుచూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతగా `బాహుబలి` తెలుగు సినిమా స్వరూపాన్నే మార్చేసింది.
ఈ నేపథ్యంలో సీనియర్ హీరో... ఇటీవల నారప్ప, దృశ్యం 2 చిత్రాలతో వరుస హిట్ లని తన ఖాతాలో వేసుకున్న విక్టరీ వెంకటేష్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ వినిపించబోతున్నారని తెలిసింది.
నిజంగా ఇది ఆయన అభిమానులకు గుడ్ న్యూసే. ఎందుకంటే ఈ ఏడాది వరుస విజయాలతో రెట్టించిన ఉత్సాహంతో వున్న విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది బాలీవుడ్లో ఓ సినిమా చేయబోతున్నారు. దాదాపు 25 ఏళ్ల క్రితం అంటే 1995లో బ్లాక్ బస్టర్ హిట్ మూవీ `యమలీల` ఆధారంగా రూపొందిన రీమేక్ `తక్దీర్ వాలా` లో నటించారు వెంకటేష్.
మళ్లీ ఇన్నేళ్ల విరామం తరువాత బాలీవుడ్ సినిమాకు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలిసింది. బాలీవుడ్లో చేసిన `తక్దీర్ వాలా` ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించకపోవడంతో కేవలం తెలుగు చిత్రాలకు మాత్రమే పరిమిత మయ్యారాయన.
మళ్లీ ఇన్నేళ్ల విరామం అనంతరం విక్టరీ వెంకటేష్ బాలీవుడ్ లో సినిమా చేయబోతున్నారు. అది కూడా కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో కలిసి. ఈ చిత్రాన్ని నిర్మాత సాజిద్ నదియా వాలా నిర్మించనుండగా ఈ మూవీకి ఫర్హాన్ సమ్జీ డైరెక్ట్ చేయబోతున్నారు. ఇద్దరి బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా ఈ మూవీని యాక్షన్ కామెడీ గా రూపొందించనున్నారట.
ఈ చిత్రంలో సల్మాన్ కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించబోతోంది. వెంకటేష్ సరసన నటించే హీరోయిన్ ని ఫైనల్ చేయాల్సి వుంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభిస్తారట.
ఈ నేపథ్యంలో సీనియర్ హీరో... ఇటీవల నారప్ప, దృశ్యం 2 చిత్రాలతో వరుస హిట్ లని తన ఖాతాలో వేసుకున్న విక్టరీ వెంకటేష్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ వినిపించబోతున్నారని తెలిసింది.
నిజంగా ఇది ఆయన అభిమానులకు గుడ్ న్యూసే. ఎందుకంటే ఈ ఏడాది వరుస విజయాలతో రెట్టించిన ఉత్సాహంతో వున్న విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది బాలీవుడ్లో ఓ సినిమా చేయబోతున్నారు. దాదాపు 25 ఏళ్ల క్రితం అంటే 1995లో బ్లాక్ బస్టర్ హిట్ మూవీ `యమలీల` ఆధారంగా రూపొందిన రీమేక్ `తక్దీర్ వాలా` లో నటించారు వెంకటేష్.
మళ్లీ ఇన్నేళ్ల విరామం తరువాత బాలీవుడ్ సినిమాకు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలిసింది. బాలీవుడ్లో చేసిన `తక్దీర్ వాలా` ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించకపోవడంతో కేవలం తెలుగు చిత్రాలకు మాత్రమే పరిమిత మయ్యారాయన.
మళ్లీ ఇన్నేళ్ల విరామం అనంతరం విక్టరీ వెంకటేష్ బాలీవుడ్ లో సినిమా చేయబోతున్నారు. అది కూడా కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో కలిసి. ఈ చిత్రాన్ని నిర్మాత సాజిద్ నదియా వాలా నిర్మించనుండగా ఈ మూవీకి ఫర్హాన్ సమ్జీ డైరెక్ట్ చేయబోతున్నారు. ఇద్దరి బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా ఈ మూవీని యాక్షన్ కామెడీ గా రూపొందించనున్నారట.
ఈ చిత్రంలో సల్మాన్ కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించబోతోంది. వెంకటేష్ సరసన నటించే హీరోయిన్ ని ఫైనల్ చేయాల్సి వుంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభిస్తారట.