గీతా ఆర్ట్స్ జోరు మామూలుగా లేదుగా!

Update: 2019-12-05 07:03 GMT
టాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాణ సంస్థలలో గీతా ఆర్ట్స్ ఒకటి.  గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కే సినిమాలకు విజయాల శాతం కూడా ఎక్కువ.  మొదట్లో స్టార్ హీరోల సినిమాలకు.. భారీ బడ్జెట్ సినిమాలకు పరిమితమైన గీతా ఆర్ట్స్ గత కొన్నేళ్ళుగా రూటు మార్చి పెద్ద సినిమాలతో పాటుగా తక్కు బడ్జెట్.. మిడ్ రేంజ్ సినిమాలను కూడా నిర్మిస్తూ న్యూ జెనరేషన్ ట్రెండ్ ను అందిపుచ్చుకుంది.

గీతా ఆర్ట్స్ బ్యానర్ ప్రస్తుతం హారిక హాసిని క్రియేషన్స్ వారితో కలిసి అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సినిమాలో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.  ఇది కాకుండా రెండు రోజుల క్రితం యువ హీరో నిఖిల్ తో ఒక కొత్త సినిమా ప్రకటన వచ్చింది.  పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు సుకుమార్ కథ.. స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.  జీఎ2 పిక్చర్స్.. సుకుమార్ రైటింగ్స్  ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తారు. ఈ సినిమా కాకుండా గీతావారు మరో రెండు సినిమాలు లైన్లో పెట్టారట.  

ఆ రెండిటిలో రేపు ఒక సినిమా ప్రకటన రానుందని..వచ్చేవారంలో మరో సినిమా ప్రకటన ఉంటుందని సమాచారం. ఈ సినిమాలు కుర్రహీరోలతోనే ఉంటాయని టాక్.  అంటే.. నిఖిల్ సినిమాతో కలిపి మొత్తం మూడు సినిమాలన్నమాట.  ఈ మూడు సినిమాల ఒకేసారి షూటింగ్ జరుపుకుంటాయని అంటున్నారు.  బాలీవుడ్ లో యష్ రాజ్ ఫిలిమ్స్ వారు ఇలా పెద్ద బడ్జెట్ సినిమాలతో పాటుగా మిడ్ రేంజ్.. తక్కువ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూ ఉంటారు.  గీతా ఆర్ట్స్ వారు కూడా అదే బాటలో ప్రయాణిస్తూ ఉన్నారని.. టాలీవుడ్ వైఆర్ఎఫ్ గా మారుతున్నారనే టాక్ వినిపిస్తోంది.
Tags:    

Similar News