జేజమ్మ సింగర్ పై లేడీ జర్నలిస్ట్ ఆరోపణలు

Update: 2018-10-09 07:30 GMT
మంచివాళ్ళను వెతకాలంటే హబుల్ టెలిస్కోప్ లాంటిది కావాలి కానీ పనికిమాలిన వాళ్ళను.. వెధవలను వెతకనవసరం లేదు. మనచుట్టూ ఉండే వారిలో 90 శాతంవాళ్ళే.. మన చుట్టూ అంటే మనకిష్టం లేని పక్కింటి.. వెనకింటి వాళ్ళు కాదు మన కొంపల్లోనే కోకొల్లలుగా వెధవలుంటారు. కానీ ప్రేమ - బంధుత్వం అనే మాయలో ఒక్కోసారి ఆ వెధవలని గుర్తించడం కష్టమౌతుంది.  కానీ ఇక్కడ సమస్యేంటంటే వెధవని వెధవ అని ప్రూవ్ చేయడం!

అందుకే  ఎవరిపైన ఎవరినా ఆరోపణలు చేస్తే అవి నమ్మాలా వద్దా..   అనేది పెద్ద సమస్య.  ఇదిలా ఉంటే వెధవల్లో ఫేక్ ఆరోపణలు చెసేవారూ కూడా ఉంటారు.. అలాంటప్పుడు మరింత ప్రమాదం. ఏదేమైనా  #మీటూ కాంపెయిన్ మాత్రం ఇండియాలో ఇప్పుడు సెలబ్రిటీ సమాజాన్ని షేక్ చేస్తోంది. అందులో భాగంగా చాలామంది మహిళలు తమకు జరిగిన లైంగిక వేధింపుల సంఘటనలను బయటకు చెప్పుకుంటున్నారు.  తనుశ్రీ దత్తా ఎపిసోడ్ తర్వాత ఇలా చాలామంది తాము ఎదుర్కొన్న ఇబ్బందులు బయటపెట్టారు.

నాలుగు రోజుల క్రితం పూజా భట్..  రెండు రోజుల క్రితం సింగర్ చిన్మయి శ్రీపాద అలా ఓపెనప్ అయినవాళ్ళలో ఉన్నారు. ఇక తాజాగా నటాషా హేమరాజిని అనే ఫోటో జర్నలిస్ట్ పాపులర్ సింగర్ కైలాష్ ఖేర్ పై తీవ్ర ఆరోపణలు చేసింది.  ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మరో మహిళా కొలీగ్ తో ఆయన వద్దకు వెళ్తే తొడలపై చెయ్యేసి అసభ్యంగా ప్రవర్తించాడని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది.  ఇక ఈ విషయం గురించి బయటకు చెప్తానంటే అందరూ తన నోరు మూయించారట.  ఆ ఇంటర్వ్యూ ను లైంగిక వేధింపుల కోణంలో రాద్దామని చెప్తే 'ఆ ఇంటర్వ్యూ జన్మలో పబ్లిష్ కాదు' అని తనను వారించారట.  ఇంతకీ కైలాష్ ఖేర్ ఎవరో తెలుసు కదా 'జేజమ్మా జేజమ్మా'.. 'పండగలా దిగివచ్చాడు' లాంటి పాటలో  తెలుగు వారి హృదయాలను గెలుచుకున్న బాలీవుడ్ సింగర్.  

మరో మోడల్ కమ్ హిందీ బిగ్ బాస్ కాంటెస్టెంట్ జుల్ఫీ సయ్యద్ కూడా ఒక పీఆర్ ఈవెంట్ కు హాజరయిన సందర్భంలో తనతో నీచంగా ప్రవర్తించాడని నటాషా ఆరోపించింది.  నటాషా ఆరోపణలు ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాయి.
    

Tags:    

Similar News