వైర‌ల్ః తార‌క్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?

Update: 2021-05-17 08:30 GMT
జూనియ‌ర్ ఎన్టీఆర్ కొవిడ్ బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ నెల 10న ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించాడు తార‌క్‌. తన‌తోపాటు ఇంట్లోని వారంతా క్వారంటైన్లో ఉన్నామ‌ని, అంద‌రూ బాగానే ఉన్నార‌ని, ఎవ్వ‌రూ ఆందోళ‌న చెందొద్ద‌ని కోరారు. ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు.

అయితే.. ఫ్యాన్స్ మాత్రం చాలా నిరుత్సాహంలో ఉన్నారు. కార‌ణం ఏమంటే.. మ‌రో మూడు రోజుల్లో జూనియ‌ర్ బ‌ర్త్ డే ఉంది. ఈ నెల 20వ తేదీన తార‌క్ 38వ‌ వ‌సంతంలోకి అడుగు పెట్ట‌బోతున్నారు. ఇంత‌టి ముఖ్య‌మైన అకేష‌న్లో తార‌క్ కొవిడ్ బారిన ప‌డి ఉండ‌డం అభిమానుల‌ను ఆవేద‌న‌కు గురిచేస్తోంది.

దీంతో.. జూనియ‌ర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఫ్యాన్స్ దేవాల‌యాల‌కు వెళ్లి పూజ‌లు చేస్తున్నారు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ‘‘మా నందమూరి తారకరామారావు గారు కొవిడ్ నుంచి త్వరగా కోలుకోవాలని ఈ రోజు తిరుప‌తిలో దేవాల‌యానికి, మ‌సీదుకు, చ‌ర్చికి వెళ్లి ప్రార్థ‌న‌లు చేశాం’’ అంటూ ఓ వీడియోను షేర్ చేశారు.

ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. దీంతో.. తార‌క్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఫ్యాన్స్ తోపాటు స‌గ‌టు ప్రేక్ష‌కులు కూడా కామెంట్ చేస్తున్నారు. ఇక‌, సినిమాల గురించి చూస్తే.. ఆర్ ఆర్ ఆర్ పూర్త‌యిన త‌ర్వాత కొర‌టాల శివ‌తో ఓ సినిమా చేయ‌నున్నాడు జూనియ‌ర్‌. Full ViewFull View
Tags:    

Similar News