మహానటితో బంగారం ప్రారంభించేశాడు

Update: 2017-06-22 12:59 GMT
మణిరత్నం మూవీ ఓకే బంగారంతో టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో దుల్కర్ సల్మాన్. ఇప్పుడీ యంగ్ హీరో మరో తెలుగు సినిమాలో నటించేస్తున్నాడు. అలనాటి తార సావిత్రి బయోపిక్ గా రూపొందుతున్న మహానటిలో నటిస్తున్నాడు దుల్కర్ సల్మాన్.

ఇప్పటికే హైద్రాబాద్ వచ్చేసిన దుల్కర్ సల్మాన్.. షూటింగ్ కూడా ప్రారంభించేశాడు. మహానటి చిత్రంలో జెమినీ గణేశన్ పాత్రలో కనిపించనున్నాడు ఈ హీరో. సావిత్రి భర్త అయిన జెమినీ గణేశన్ పాత్ర.. ఆమె జీవితంలో ఎన్నో కీలక మార్పులకు కారణంగా నిలుస్తుంది. అంతటి కీ రోల్ కావడంతోనే మహానటిలో నటించేందుకు సై అనేసిన దుల్కర్.. ఇప్పటికే షూటింగ్ చేసేస్తున్నాడు. సావిత్రిగా నటిస్తున్న కీర్తి సురేష్-దుల్కర్ సల్మాన్ ల మధ్య వచ్చే కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్.

మహానటిలో సమంతకూడా నటిస్తుండగా.. బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి కథను నేరేట్ చేసే రోల్ లో శామ్స్ కనిపించనుంది. వైజయంతీ మూవీస్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో.. ఎన్టీఆర్.. ఏఎన్నార్ పాత్రలు కూడా కీలకంగా కనిపించనున్నాయి. ఎన్టీఆర్ పాత్రలో నటించేందుకు ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ ను ఒప్పించారనే టాక్ ఉంది. ఏఎన్నార్ రోల్ లో ఆయన వారసుల్లో ఒకరు కనిపించే ఛాన్స్ ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News