ఈ ప్రశ్నకు నాగబాబు వద్ద జవాబు ఉందా?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేనానిగా మారి రాజకీయాల్లో తనదైన ప్రస్థానం కొనసాగిస్తున్నారు. అయితే ఆయన దూకుడుకు కళ్లెం వేసేందుకు జగన్ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదంటూ చర్చ సాగుతోంది. ఇక పవన్ వల్ల టాలీవుడ్ కూడా టార్గెట్ గా మారిందనేది కొందరి వాదన.
ముఖ్యంగా ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపు కేవలం పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేసేందుకే అంటూ చాలామంది వాదిస్తున్నారు. నిజమే.. వకీల్ సాబ్ మొదలు భీమ్లా నాయక్ వరకూ పవన్ పై ఉక్కుపాదం మోపేందుకు జగన్ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదని తాజా పరిణామాలు చెబుతున్నాయి. జనసేనానిపై కక్షతోనే వైఎస్ జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం చేయగలిగినదంతా చేసిందని సులభంగా అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో మెగా బ్రదర్ నాగబాబు ఈ విషయంలో సినీపెద్దల తీరుతెన్నులను తూర్పారబట్టారు. ఎవరికీ జగన్ ప్రభుత్వాన్ని అడిగే ధైర్యం లేదని .. పవన్ ముందుండి ప్రశ్నిస్తే తనకు మద్ధతునివ్వలేదని నాగబాబు వాపోయారు. పవన్ కి మద్ధతివ్వకపోయినా కానీ తమ మద్ధతు పరిశ్రమకు ఉంటుందని మంచి చేస్తామని అన్నారు.
పవన్ కళ్యాణ్ ను రెచ్చగొట్టడానికి జగన్ రెడ్డి చేయగలిగినదంతా చేస్తూ ఉండవచ్చు. అయితే కేవలం ఐదేళ్లు మాత్రమే అధికారంలో ఉంటారని .. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తుందని ఆయన గుర్తించాలి. అతను చైనాకు చెందిన జిన్ పింగ్.. రష్యాకు చెందిన పుతిన్ లేదా ఉత్తర కొరియాకు చెందిన కిమ్ జోంగ్ ఉన్ కాదు. అతను ఈ రోజు అధికారంలో ఉండవచ్చు కానీ పరిస్థితులు త్వరలో లేదా తరువాత మారుతాయి.. అంటూ నిప్పులు చెరిగారు.
మెగా బ్రదర్ మాట్లాడుతూ.. ``పవన్ కళ్యాణ్ పై ఏపీ ప్రభుత్వం నేరుగా దాడి చేయడాన్ని ఒకరిద్దరు మినహా సినీ పరిశ్రమకు చెందిన ఎవరూ ఖండించలేదు. దీనికి వ్యతిరేకంగా ఎవరూ ట్వీట్లు కూడా చేయలేదు. అయినా పర్వాలేదు. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం నుండి టాలీవుడ్ కు చెందిన ఎవరైనా ఇటువంటి అణచివేతను ఎదుర్కొంటే మేము వారికి అండగా ఉంటాము.
నాగబాబు చేసిన వ్యాఖ్య ఇప్పుడు కొత్త ప్రశ్నకు తావిస్తోంది. టిక్కెట్టు ధరల విషయంలో పవన్ కళ్యాణ్ కు బహిరంగంగా మద్దతు తెలిపిన నాని... శ్యామ్ సింగరాయ్ థియేట్రికల్ రిలీజ్ సమయంలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుండగా.. నాగ బాబు ఎక్కడున్నాడంటూ పరిశీలకులు అడుగుతున్నారు.
కావాలంటే టాలీవుడ్ కి అండగా నిలుస్తానని నాగబాబు చెబుతున్నా ఆంధ్రప్రదేశ్ లో శ్యామ్ సింగరాయ్ కు ఎదురైన కష్టాల గురించి మాట్లాడడం లేదనేది కొందరి అభిప్రాయం. కష్టం తమకు వస్తేనే నిలదీస్తారా నాగబాబూ? అంటూ ఒక వర్గం ప్రశ్నిస్తోంది.
ముఖ్యంగా ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపు కేవలం పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేసేందుకే అంటూ చాలామంది వాదిస్తున్నారు. నిజమే.. వకీల్ సాబ్ మొదలు భీమ్లా నాయక్ వరకూ పవన్ పై ఉక్కుపాదం మోపేందుకు జగన్ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదని తాజా పరిణామాలు చెబుతున్నాయి. జనసేనానిపై కక్షతోనే వైఎస్ జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం చేయగలిగినదంతా చేసిందని సులభంగా అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో మెగా బ్రదర్ నాగబాబు ఈ విషయంలో సినీపెద్దల తీరుతెన్నులను తూర్పారబట్టారు. ఎవరికీ జగన్ ప్రభుత్వాన్ని అడిగే ధైర్యం లేదని .. పవన్ ముందుండి ప్రశ్నిస్తే తనకు మద్ధతునివ్వలేదని నాగబాబు వాపోయారు. పవన్ కి మద్ధతివ్వకపోయినా కానీ తమ మద్ధతు పరిశ్రమకు ఉంటుందని మంచి చేస్తామని అన్నారు.
పవన్ కళ్యాణ్ ను రెచ్చగొట్టడానికి జగన్ రెడ్డి చేయగలిగినదంతా చేస్తూ ఉండవచ్చు. అయితే కేవలం ఐదేళ్లు మాత్రమే అధికారంలో ఉంటారని .. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తుందని ఆయన గుర్తించాలి. అతను చైనాకు చెందిన జిన్ పింగ్.. రష్యాకు చెందిన పుతిన్ లేదా ఉత్తర కొరియాకు చెందిన కిమ్ జోంగ్ ఉన్ కాదు. అతను ఈ రోజు అధికారంలో ఉండవచ్చు కానీ పరిస్థితులు త్వరలో లేదా తరువాత మారుతాయి.. అంటూ నిప్పులు చెరిగారు.
మెగా బ్రదర్ మాట్లాడుతూ.. ``పవన్ కళ్యాణ్ పై ఏపీ ప్రభుత్వం నేరుగా దాడి చేయడాన్ని ఒకరిద్దరు మినహా సినీ పరిశ్రమకు చెందిన ఎవరూ ఖండించలేదు. దీనికి వ్యతిరేకంగా ఎవరూ ట్వీట్లు కూడా చేయలేదు. అయినా పర్వాలేదు. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం నుండి టాలీవుడ్ కు చెందిన ఎవరైనా ఇటువంటి అణచివేతను ఎదుర్కొంటే మేము వారికి అండగా ఉంటాము.
నాగబాబు చేసిన వ్యాఖ్య ఇప్పుడు కొత్త ప్రశ్నకు తావిస్తోంది. టిక్కెట్టు ధరల విషయంలో పవన్ కళ్యాణ్ కు బహిరంగంగా మద్దతు తెలిపిన నాని... శ్యామ్ సింగరాయ్ థియేట్రికల్ రిలీజ్ సమయంలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుండగా.. నాగ బాబు ఎక్కడున్నాడంటూ పరిశీలకులు అడుగుతున్నారు.
కావాలంటే టాలీవుడ్ కి అండగా నిలుస్తానని నాగబాబు చెబుతున్నా ఆంధ్రప్రదేశ్ లో శ్యామ్ సింగరాయ్ కు ఎదురైన కష్టాల గురించి మాట్లాడడం లేదనేది కొందరి అభిప్రాయం. కష్టం తమకు వస్తేనే నిలదీస్తారా నాగబాబూ? అంటూ ఒక వర్గం ప్రశ్నిస్తోంది.