మెగాస్టార్ ని డైరెక్ట్ చేయబోతున్న మెగా డాటర్...!
ప్రస్తుతం తెలుగులోనూ వెబ్ సిరీస్ లకు కూడా క్రేజ్ బాగా పెరుగుతోంది. రాబోయే రోజుల్లో వెబ్ కంటెంట్ హవా నడవబోతున్నదని భావిస్తున్న పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు ఇప్పటికే డిజిటల్ రంగంలోకి అడుగు పెట్టారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా డిజిటల్ ప్లాట్ ఫార్మ్ 'ఆహా'ని క్రియేట్ చేశారు. ఇప్పటికే శరత్ మరార్ - స్వప్న దత్ - క్రిష్ లాంటి వారు కూడా ఓటీటీ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ వైపు అడుగులు వేశారు. కాలక్రమేణా వెబ్ కంటెంట్ కి ప్రాధాన్యత పెరగడంతో వీరితోపాటు చాలా మంది బడా నిర్మాతలు ఇదే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా వెబ్ కంటెంట్ వైపు అడుగులు వేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. నటీనటులు కూడా వెబ్ సిరీస్ లలో నటించడానికి ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. బాలీవుడ్ లో ఇప్పటికే పెద్ద పెద్ద స్టార్ హీరోలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ వస్తున్నారు. మన తెలుగు వెబ్ సిరీస్ లలో ఇప్పటికే శ్రీకాంత్ - జగపతిబాబు - సందీప్ కిషన్ - అల్లు శిరీష్ - నవదీప్ లాంటి హీరోలు వెబ్ సిరీస్ లలో నటించారు. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన జనాలు.. సినిమాల కంటే వెబ్ సిరీస్ లను వీక్షించడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అర్థం అవుతోంది. దీంతో స్టార్ హీరోలను వెబ్ సిరీస్ లలో నటింపచేసి వాటికి మరింత క్రేజ్ తేవాలని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే సమంత - ప్రియమణి - కియారా అద్వానీ లాంటి హీరోయిన్స్ వెబ్ సిరీస్ ల వైపు అడుగులు వేశారు.
ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా మెగాస్టర్ చిరంజీవి ఓ వెబ్ సిరీస్ లో నటించబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక వెబ్ సిరీస్ లో నటించబోతున్నానని చిరు చెప్పాడట. ఇదే కనుక నిజమైతే చిరంజీవి లాంటి టాప్ స్టార్ ఎంట్రీ ఇస్తే తెలుగులోనూ వెబ్ సిరీస్ ల హవా మొదలవుతుందని చెప్పవచ్చు. అయితే ఈ వెబ్ సిరీస్ కి ఎవరు డైరెక్షన్ చేయబోతున్నారు అనే ఆసక్తి అందరిలో మొదలైంది. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం చిరు నటించబోయే వెబ్ సిరీస్ కి చిరు తనయ సుష్మిత దర్శకత్వం చేయబోతున్నారట. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురైన సుస్మిత ఇప్పటికే మెగా హీరోల సినిమాలకి కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో తన తండ్రి డిజిటల్ డెబ్యూ కోసం కూతురు డెబ్యూ డైరెక్టర్ అవతారం ఎత్తబోతోందని సమాచారం. ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడున్నాయి. మెగాస్టార్ ప్రస్తుతం తన కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత మరో ముగ్గురు యంగ్ డైరెక్టర్లతో సినిమాలు ఉంటాయని ఇప్పటికే ప్రకటించారు. యంగ్ డైరెక్టర్స్ సుజిత్.. బాబీ.. మెహార్ రమేశ్ లతో సినిమాలు చేయబోతున్నాని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత సాధ్యమైనంత ఫాస్ట్ గా 'ఆచార్య' మూవీ కంప్లీట్ చేసి చిరు లూసిఫర్ తెలుగు రీమేక్ ని పట్టాలెక్కించే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా మెగాస్టర్ చిరంజీవి ఓ వెబ్ సిరీస్ లో నటించబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక వెబ్ సిరీస్ లో నటించబోతున్నానని చిరు చెప్పాడట. ఇదే కనుక నిజమైతే చిరంజీవి లాంటి టాప్ స్టార్ ఎంట్రీ ఇస్తే తెలుగులోనూ వెబ్ సిరీస్ ల హవా మొదలవుతుందని చెప్పవచ్చు. అయితే ఈ వెబ్ సిరీస్ కి ఎవరు డైరెక్షన్ చేయబోతున్నారు అనే ఆసక్తి అందరిలో మొదలైంది. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం చిరు నటించబోయే వెబ్ సిరీస్ కి చిరు తనయ సుష్మిత దర్శకత్వం చేయబోతున్నారట. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురైన సుస్మిత ఇప్పటికే మెగా హీరోల సినిమాలకి కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో తన తండ్రి డిజిటల్ డెబ్యూ కోసం కూతురు డెబ్యూ డైరెక్టర్ అవతారం ఎత్తబోతోందని సమాచారం. ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడున్నాయి. మెగాస్టార్ ప్రస్తుతం తన కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత మరో ముగ్గురు యంగ్ డైరెక్టర్లతో సినిమాలు ఉంటాయని ఇప్పటికే ప్రకటించారు. యంగ్ డైరెక్టర్స్ సుజిత్.. బాబీ.. మెహార్ రమేశ్ లతో సినిమాలు చేయబోతున్నాని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత సాధ్యమైనంత ఫాస్ట్ గా 'ఆచార్య' మూవీ కంప్లీట్ చేసి చిరు లూసిఫర్ తెలుగు రీమేక్ ని పట్టాలెక్కించే అవకాశం ఉంది.