మరోసారి మాయ చేయబోతున్న చై-సామ్

Update: 2020-05-27 13:30 GMT
టాలీవుడ్ లో అందమైన జోడీలలో నాగచైతన్య-సమంత జోడీని చెప్పుకోవాలి. రియల్ లైఫ్ లో కూడా ప్రేమించుకుని భార్యాభర్తలుగా మారడంతో ఈ జోడీపై ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి ఎక్కువే. ఇప్పటికే ఇద్దరూ నాలుగు సినిమాలలో హీరో హీరోయిన్లుగా నటించారు. 'ఏ మాయ చేసావె'.. 'మనం'.. 'మజిలీ' సూపర్ హిట్లుగా నిలవగా 'ఆటోనగర్ సూర్య' మాత్రం నిరాశపరిచింది. తాజా సమాచారం ప్రకారం ఇద్దరూ మరోసారి కలిసి నటించబోతున్నారట.

చైతు-సమంతా తొలిసారి 'ఏ మాయ చేసావె' లో హీరో-హీరోయిన్లుగా నటించారు. ఆ సినిమా దర్శకుడు గౌతమ్ మీనన్ ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట. సీక్వెల్ లో అదే జోడీని రిపీట్ చెయ్యాలనే ఉద్దేశంతో ఉన్నారట. ఈ సినిమా తెలుగు వెర్షన్ లో చైతు-సమంతా.. తమిళ వెర్షన్లో శింబు-త్రిష నటిస్తారని సమాచారం. ఒరిజినల్ సినిమాల తరహాలోనే ఈ సినిమాలో వీరే కామియోలు చేస్తారట.

చైతు-సమంతా కలిసి నటిస్తే ఆ సినిమా అటోమేటిక్ గా క్రేజీ ప్రాజెక్టుగా మారిపోతుంది. వారిద్దరూ నటించిన లాస్ట్ సినిమా 'మజిలీ' ఐతే చైతు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కాబట్టి ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉంటాయి. అయితే 'ఏ మాయ చేసావె' లాగా గౌతమ్ మీనన్ ప్రేక్షకులను మరోసారి మాయ చెయ్యగలడా అనేది వేచి చూడాలి.
Tags:    

Similar News