#BIGGBOSS5TELUGU E8 : సన్‌ డే ఫన్‌ డే.. చివర్లో ఎమోషనల్‌ అండ్ యాగ్రీ

Update: 2021-09-13 03:32 GMT
బిగ్ బాస్‌ తెలుగు సీజన్ 5 మొదటి వీకెండ్‌ పూర్తి చేసుకుంది. శని ఆది వారాల్లో నాగార్జున వచ్చేశాడు. ఆయన ఎప్పటిలాగే సందడి చేశాడు. శనివారం ఎపిసోడ్‌ లో కొందరి తప్పులు చెప్పే ప్రయత్నం చేశాడు.. కొందరి గురించి ప్రశంసలు కురిపించాడు. శనివారం ఎపిసోడ్ లో రవి మరియు హమీదాలను సేవ్ చేశారు. ఇక ఆదివారం ఎపిసోడ్ లో ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా మానస్‌.. కాజల్‌ లు సేవ్ అయ్యారు. చివర్లో జెస్సీ మరియు సరయులు నిలిచారు. ముందుగానే లీక్ అయినట్లుగా బిగ్ బాస్ సీజన్ 5 మొదటి ఎలిమినేషన్ సరయు అయ్యింది.

బిగ్ బాస్ నుండి మొదటి వారమే ఎలిమినేషన్‌ అంటే కాస్త ఇబ్బంది కలిగించే విషయమే. చాలా ఎమోషనల్‌ అయ్యే పరిస్థితి. అయితే మెంటల్ గా చాలా స్ట్రాంగ్ అయిన సరయు ఎమోషనల్‌ అయినట్లుగా అనిపించినా కూడా కన్నీరు మాత్రం పెట్టుకోకుండా బయటకు వెళ్లింది. ఆమె గేటు దాటే సమయంలో డాన్స్ చేస్తూ మరీ వెళ్లింది. ఆమె వీక్‌ కంటెస్టెంట్‌ అని ఎవరు భావించలేదు. కాని ఆమె ఎలిమినేషన్ లోకి రావడం వల్ల ప్రేక్షకులు ఆమె కు పెద్దగా సపోర్ట్‌ దక్కలేదు. దాంతో ఎలిమినేట్ అయినట్లుగా చెబుతున్నారు.

సరయు ఎలిమినేషన్ కు ముందు సన్ డే ఫన్‌ డే అంటూ ఇంటి సభ్యులతో బయట లాన్ లో ఆటలు ఆడించాడు. మొదట ర్యాంప్ వాక్ చేశారు. అందులో ఎవరికి ఇష్టం వచ్చిన ప్రాపర్టీని వారు వినియోగిస్తూ ర్యాంప్‌ వాక్ చేయాల్సి ఉంటుంది. ర్యాంప్‌ వాక్ జడ్జ్‌ గా జెస్సీ వ్యవహరించాడు. నాగార్జున కూడా మార్కులు వేశారు. ఇద్దరు కూడా ఎవరికి తోచిన మార్కులు వారు వేయడం జరిగింది. కొందరు ర్యాంప్ వాక్‌ అని చెప్పి డాన్స్ చేయగా కొందరు మాత్రం ర్యాంప్ వాక్ బాగానే చేశారు. లోబో మరియు ఉమా దేవిలు ర్యాంప్ వాక్ చేసి తెగ నవ్వించేశారు. ఇక శ్రీరామ చంద్ర మరియు సిరిలు రొమాంటిక్ గా ర్యాంప్ వాక్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. మొత్తానికి బిగ్‌ బాస్ మొదటి ఆదివారం ఫన్‌ డే గానే సాగింది. సరయు ఎలిమినేట్‌ అయిన సమయంలో మాత్రం కాస్త ఎమోషనల్ అయ్యింది.

సరయు బయటకు వెళ్లే  సమయంలో విశ్వ ఎక్కువ కన్నీరు పెట్టుకున్నాడు. ఆ తర్వాత హమీదా కూడా తన స్నేహితురాలు వెళ్లి పోతుంది అంటూ కన్నీరు పెట్టుకుంది. హౌస్‌ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిన తర్వాత నాగార్జునతో స్టేజ్ నుండి ఇంటి సభ్యులతో సరయు మాట్లాడింది. ఆ సమయంలో 5 మంది బెస్ట్‌ కంటెస్టెంట్స్ ను చెప్పమని అడుగగా శ్వేత.. మానస్‌.. ప్రియాంక.. విశ్వ మరియు హమీదాల పేర్లు చెప్పింది. వారిని ఆకాశమే హద్దు అన్నట్లుగా ఎత్తేసింది. ఇక చివర్లో అయిదుగురు వరస్ట్‌ కంటెస్టెంట్స్ ను చెప్పమనడంతో ఆమె మొదటగా సిరిని తీసుకుంది. సిరిపై చాలా సీరియస్‌ గా కామెంట్స్ చేసింది.
4

ఆ తర్వాత సన్నీ.. లహరి.. షణ్ముఖ్‌ మరియు కాజల్ ల పేర్లను ఆమె తీసుకుంది. లహరి గురించి చెప్పిన సమయంలో ఆవేశంతో సరయు ఊగిపోయింది. సన్నీతో చాలా కాలం క్రితం ఒక సినిమాలో నటించాను. ఆ సమయంలో జరిగిన ఒక సంఘటన మనసులో పెట్టుకుని అతడు నాతో సరిగా లేడు అంటూ ప్రతి ఒక్కరిపై కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేసి సరయు వెళ్లి పోయింది. బూతుల సరయు తన బూతులను ఇంకా స్టార్ట్‌ చేయకుండానే వెళ్లి పోవడం పట్ల కొందరు ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదట సీక్రెట్ రూమ్‌ ద్వారా ఆమె వస్తుందని అంతా అనుకున్నారు. కాని ఆమె మాత్రం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఒక వేళ సరయు రీ ఎంట్రీ ఇస్తే హౌస్ లో రచ్చ రచ్చే.
Tags:    

Similar News