ఫైనల్ కలెక్షన్స్: భరత్ అనే నేను 8 కోట్ల నష్టం

Update: 2018-06-08 08:06 GMT
వరుసగా బ్రహ్మోత్సవం - స్పైడర్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు మొత్తానికి హ్యాట్రిక్ డిజాస్టర్ కాకుండా జాగ్రత్త పడ్డాడు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భారత్ అనే నేను సినిమాతో మహేష్ ఫ్యాన్స్ ను ఖుషి చేశాడు. విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. అంతా బాగానే ఉంది గాని విడుదలైన కొన్ని రోజులకే చిత్ర యూనిట్ 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అని పోస్టర్స్ ని రిలీజ్ చేసింది.

అది ఎంధుకు రిలీజ్ చేశారో గానీ సినిమా ఫైనల్ వరల్డ్ కలెక్షన్స్ ఒక సారి పరిశీలిస్తే ఎవ్వరైనా సరే షాక్ అవుతారు. ఎందుకంటే సినిమా త్రియేటికల్ రైట్స్ పరంగా చూసుకుంటే 8 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. భరత్ అనే నేను 100 కోట్లకు సేల్ అవ్వగా 92 కోట్ల షేర్స్ మాత్రమే అందాయి. గ్రాస్ పరంగా 149.5 కోట్లను క్రాస్ చేసింది. హిట్టు బొమ్మ అనుకున్న ఈ సినిమా రిజల్ట్ ఫైనల్ గా ఎబో యావరేజ్ అని తేలింది.

కొన్ని ఏరియాల్లో లాభాలు బాగానే వచ్చినా మరికొన్ని ఏరియాల్లో నష్టపోకుండా బయ్యర్స్ సేఫ్ జోన్ లో పడ్డారు. ఇక కొన్ని ఏరియాల్లో లెక్కలను చుస్తే 8 కోట్ల వరకు డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టాన్ని మిగిల్చింది. నిర్మాత మాత్రం సేఫ్ జోన్ అనే చెప్పాలి. ఫ్యాన్స్ ను ఎక్కువగా మెప్పించిన ఈ సినిమా మిగతా ఆడియెన్స్ ని రెండవసారి థియేటర్ వరకు రప్పించలేకపోయింది. మరోసారి చూసే కంటెంట్ కూడా గొప్పగా ఏమి లేదనే టాక్ వస్తోంది. ఫైనల్ గా మహేష్ అయితే సేఫ్ జోన్ లో కి వచ్చే విధంగా సినిమా చేసుకోగలిగాడు.


Disclaimer: Figures mentioned here have been collected from few sources and also include estimates. Authenticity can't be guaranteed...!
Tags:    

Similar News