‘మినిస్టర్ బండ్ల గణేష్’ పక్కా అంటున్నాడు

Update: 2017-02-27 10:41 GMT
చిన్న చిన్న కామెడీ వేషాలతో మొదలుపెట్టి.. బడా ప్రొడ్యూసర్ అయిపోయాడు బండ్ల గణేష్. మరి అతడి తర్వాతి లక్ష్యమేంటి..? రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిపోవడమేనట. 2019 ఎన్నికల్లో ఇది జరిగి తీరుతుందని కూడా అతను ఘంటాపథంగా చెబుతున్నాడు. తన దేవుడు పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరుతాడని.. ఆ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అవుతుందని.. తాను కూడా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రినవుతానని బండ్ల గణేష్ ధీమా వ్యక్తం చేశాడు.

‘‘రాజకీయాల్లో నాకు బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నా.  పార్లమెంటులో ఒకసారి అధ్యక్షా అనాలని ఉంది. మంత్రి పదవి కూడా చేపట్టాలని ఉంది. 2019 ఎన్నికల్లో వార్ వన్ సైడే. పవన్ గెలుస్తాడు. ముఖ్యమంత్రి అవుతాడు. నేను కూడా గెలిచి మంత్రినవుతా. మీ ఆశీర్వాదం కూడా తీసుకుంటా’’ అంటూ ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో బండ్ల గణేష్ అన్నాడు. పవన్ అన్నయ్య చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ ఫెయిలైంది కదా అని అంటే.. ‘‘ఒకసారి యాక్సిడెంట్ అయ్యింది కదా అని ప్రతిసారీ అవుతుందా’’ అని ఎదురు ప్రశ్నించాడు బండ్ల.

 తాను బొత్స సత్యనారాయణకు బినామీ అనే వార్తలు విని విని విసిగెత్తిపోయానని.. తాను ఆంధ్రా బ్యాంకుకు మాత్రమే బినామీ అని.. ఎందుకంటే తాను అక్కడి నుంచే లోన్లు తెచ్చుకుంటానని బండ్ల వ్యాఖ్యానించాడు. తాను మర్డర్ చేసినా బొత్స కాపాడతాడు అని ఒక వేదిక మీద చెప్పడం తప్పేనని.. దాని వల్ల పదేళ్ల పాటు ఇబ్బంది పడ్డానని బండ్ల అన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News