రెండు శక్తులు వైజయంతిని నడిపిస్తున్నాయి!

Update: 2018-09-21 09:42 GMT
టాలీవుడ్ లో ప్రతిష్టాత్మకమైన బ్యానర్లలో వైజయంతీ మూవీస్ ఒకటి.  పెద్ద ఎన్టీఆర్ తరం నుండి జూనియర్ ఎన్టీఆర్ తరం వరకూ ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించి భారీ విజయలను అందుకున్నారు నిర్మాత సీ. అశ్విని దత్.  వరస ఫ్లాపులు ఎదురుకావడంతో సినిమానిర్మాణానికి కాస్త దూరంగా ఉన్నారు. మళ్ళీ 'మహానటి' సినిమాతో మళ్ళీ ఫామ్ లో కి వచ్చారు.  మరో వారంలో 'దేవదాస్' రిలీజ్ కానుంది.

నిన్న 'దేవదాస్' ఆడియో ఈవెంట్ లో కాస్త ఎమోషనల్ అయ్యారు అశ్విని దత్.  "ఈ సందర్భంగా నేను మాట్లాడే సమయంలో నా పక్కన ఇద్దరుండాలని కోరుకుంటున్నాను.  ఎందుకంటే నేను గత నాలుగైదేళ్ళ నుండి చాలా నిమిత్తమాత్రుడ్ని.. సంస్థను నడిపిస్తున్నది.. ఓ రెండు శక్తులున్నాయి.. మహా శక్తులు.. వారిద్దరిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను.  స్వప్న.. ప్రియాంక ఇద్దరూ వేదిక పైకి రావాలి అన్నారు."

దత్ గారు ఓ నాలుగైదేళ్ళ నుండి సినీ నిర్మాణానికి దూరంగా ఉన్నప్పటికీ దత్ కుమార్తెలయిన స్వప్న.. ప్రియాంకలు సంస్థను నడిపిస్తున్నారని సభాముఖంగా చెప్పడం గొప్ప విషయమే. ఇద్దరు కూతుళ్ళు తమ హార్డ్ వర్క్ తో తండ్రిని గర్వపడేలా చేశారు.  ఇక దత్ గారు సినిమా ఈవెంట్ గురించి మాట్లాడుతూ తనకు అభిమాన హీరోల్లో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఈ ఫంక్షన్ జరపడం సంతోషంగా ఉందని చెప్పారు. అంతే కాదు తనకు మరో అభిమాన నటుడైన నాగార్జున తమ బ్యానర్లో ఎక్కువ సినిమాలు చేసిన హీరో అని.. నాగార్జున తమ బ్యానర్ లో ఐదు సినిమాలు చేశాడని చెప్పడం విశేషం.

ఈ సినిమా తో బాలీవుడ్ కార్పోరేట్ సంస్థ వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో అడుగుపెడుతోందని తమకు వారు వరల్డ్ వైడ్ పార్టనర్ అని చెబుతూ వారికి వెల్కమ్ చెప్పాడు.


Tags:    

Similar News