షూటింగ్ లో ఉండగానే మరో ఆఫర్

Update: 2018-05-18 06:57 GMT
ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సినీ తారల కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ లో వర్కౌట్ అయిందంటే చాలు ఇక వారిపై అంచనాలు పెరిగిపోతుంటాయి. ఒక్క హిట్ పడిందంటే చాలు మరో ప్రాజెక్ట్ రావడం గ్యారెంటీ. గతంలో ఇలాంటివి చాలా జరిగేవి. కానీ ఇప్పుడు పెద్దగా అలాంటివి కనిపించడం లేదు. స్టార్ హీరోలు చేసిన హీరోయిన్ల తోనే మళ్ళీ చేయడానికి ఇష్టపడటం లేదు. కానీ చాలా రోజుల తరువాత షూటింగ్ దశలో ఉండగానే బెస్ట్ కెమిస్ట్రీ అని గుర్తింపు తెచ్చుకుంది ఓ జంట.

సాయి ధరమ్ తేజ్ - అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తేజ్ ఐ లవ్ యూ అనే ఆ సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతున్నాయి. ఈ సినిమాపైనే సాయి కూడా చాలా నమ్మకం పెట్టుకున్నాడు. అయితే సినిమాలో సాయి - అనుపమ నటన అందరిని ఆకట్టుకుంటుందని అందరు షూటింగ్ చూడగానే చెప్పేస్తున్నారు. దీంతో ఆ జంటపై మరో దర్శకుడు మనసు పారేసుకున్నాడు.

నేను శైలజా దర్శకుడు కిషోర్ తిరుమల నెక్స్ట్ సాయితో ఒక సినిమాను లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే సాయి ధరమ్ తేజ్ కి కరెక్ట్ గా అనుపమ సెట్ అవుతుందని వెంటనే ఫిక్స్ చేశాడట. ఆమెతో పాటు హలో బ్యూటీ కళ్యాణి ప్రియదర్శిన్ కూడా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి ఈ డిఫరెంట్ కాంబో ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
Tags:    

Similar News