'మహా సముద్రం'లో అనూ బేబీ...!

Update: 2020-10-19 07:15 GMT
టాలీవుడ్ లో 'Rx 100' మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ అజయ్ భూపతి తదుపరి ప్రాజెక్ట్ ''మహా సముద్రం''. ఇటీవలే అధికారికంగా ప్రకటించిన ఈ ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ లో వర్సటైల్ యాక్టర్ శర్వానంద్ మరియు 'బొమ్మరిల్లు' సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మించనున్నారు. సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ బజ్ క్రియేట్ చేస్తున్న చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరో ఆసక్తికరమైన అనౌన్స్ మెంట్ ఇచ్చింది. ఈ భారీ మల్టీస్టారర్ లో గార్జియస్ అను ఇమ్మాన్యుయేల్ మరో హీరోయిన్ గా నటించనుందని ప్రకటించారు.

'మహాసముద్రం' స్క్రిప్ట్ లో అందరికి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను క్రియేట్ చేసిన అజయ్ భూపతి.. అను ఇమ్మాన్యుయేల్ కి కూడా ఒక ముఖ్యమైన పాత్రను ఇచ్చారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీలో టాలెంటెడ్ హీరోయిన్ అదితి రావు హైదరి హీరోయిన్ గా నటించబోతుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వైజాగ్ బ్యాగ్రౌండ్ లో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెలుగు తమిళంలో ఒకేసారి తెరకెక్కించనున్నారని సమాచారం. త్వరలోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. 'మహాసముద్రం'లో నటించే ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.
Tags:    

Similar News