ఫొటోటాక్‌ : అనసూయ మళ్లీ బీచ్‌ లో స్కట్‌ షికారు

Update: 2020-10-08 04:30 GMT
జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్న ఫొటోలు మరియు వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూనే ఉంటాయి. ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా ఆమెను జనాలు అమితంగా ఆరాధించేందుకు అభిమానించేందుకు కారణం ఆమె అందం. 35 ఏళ్ల వయసు వచ్చిన హీరోయిన్స్‌ ఎంతో మంది ఇంకా హీరోలతో రొమాన్స్‌ చేస్తున్నారు. వారికంటే తాను ఎందులో తక్కువ అన్నట్లుగా 35 ఏళ్ల అనసూయ సోషల్‌ మీడియా లో తన అల్ట్రా మోడ్రన్‌ డ్రస్‌ లతో ఫొటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు గోవాలో షికారు చేస్తున్న ఫొటోలను చాలానే పెట్టింది.

భర్త భరద్వాజ్ పుట్టిన రోజు వేడుకను గోవాలో నిర్వహించిన అనసూయ అందుకు సంబంధించిన పిక్స్‌ ను షేర్‌ చేసింది. అక్కడ ఉన్నన్ని రోజులు అనసూయ మినీస్కట్‌ లోనే ఉన్నట్లుంది. రెండు రోజుల క్రితం ఎల్లో టీ షర్ట్‌ కలర్‌ ఫుల్‌ స్కట్‌ తో ఉన్న ఫొటోను షేర్‌ చేసిన అనసూయ తాజాగా మరో స్కట్‌ ఫొటోను షేర్‌ చేసింది. చాలా క్యాజ్వల్‌ గా ఉన్న ఈ ఫొటోలో అనసూయ మరోసారి వావ్‌ అనిపించేట్లుగా ఉంది.

ఫొటోలకు ఫోజులు ఇవ్వడం విషయంలో.. కాస్ట్యూమ్స్‌ విషయంలో హీరోయిన్స్‌ కంటే తాను ఏమాత్రం తక్కువ కాదు అన్నట్లుగా అనసూయ సోషల్‌ మీడియాలో కనిపిస్తుంది. పిల్లలు ఉన్నంత మాత్రాన సోషల్ అందం తగ్గి పోతుందా అనసూయ కంటే వయసులో పెద్ద వారు చాలా మంది ఇంకా కూడా మోడ్రన్‌ గా కనిపిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ లు పెడుతున్నారు అంటూ కొందరు అనసూయకు మద్దతుగా కామెంట్‌ చేస్తున్నారు.
Tags:    

Similar News