శంకర్ ఆఫీసులో.. రోబోతో ఫోజిచ్చింది

Update: 2017-10-10 17:45 GMT
ఇండియాలోనే మొట్ట మొదటిసారి అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న చిత్రం '2 పాయింట్ ఓ'. ఈ సినిమాకు మొత్తంగా 450 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. సంచలన దర్శకుడు శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తన కెరీర్ లో ఎన్ని విభిన్న సినిమాలను తీసిన శంకర్ సినిమా ఎండింగ్ లో ఎదో ఒక సందేశాన్ని ఇస్తాడు.

ఇక అసలు విషయానికి వస్తే 2.0 చిత్రం దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్స్ కూడా చివరి దశలో ఉన్నాయి. అలాగే సినిమాలో సాంగ్స్ కూడా బ్యాలెన్స్ ఉన్నాయి. దీంతో చాలా రోజుల తర్వాత హీరోయిన్ అమీ జాక్సన్ చిత్ర యూనిట్ తో కలవనుంది. సినిమాలోని మొదటి పాట కు రెడి అవ్వబోతున్నట్లు తెలిపింది. రీసెంట్ ఆమె శంకర్ ఆఫీస్ లో ఉన్న రజినీకాంత్ కృత్రిమ రోబో తో ఒక ఫోటోకి స్టీల్ ఇచ్చింది. రోబో సినిమా కోసం శంకర్ ఎన్నో రోబోలను తయారు చేయించిన సంగతి తెలిసిందే. అయితే శంకర్ వాటిలో ఒకదాన్ని తన ఆఫీస్ లో ఇలా ఉంచుకున్నాడట. ఇక రజినీకాంత్ తో రియల్ స్టెప్స్ వేసేందుకు సిద్ధంగా ఉన్నాను అంటోంది అమీ.

దాదాపు 10 రోజుల వరకు ఆ సాంగ్ ని చిత్రీకరిస్తారట. అంతే కాకుండా ఆ సాంగ్ లో ఒక స్పెషల్ ఏంటంటే.. మైకేల్ జాక్సన్ కి ఆ పాటకి కొంచెం కనెక్షన్ ఉందట. శంకర్ ఊహలకు తగ్గట్టుగా ఒక అద్భుతమైన సెట్ లో సాంగ్ ఉంటుందని టాక్. ఇక ఏఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా  రిలీజ్ కానుంది.


Tags:    

Similar News