శర్వానంద్ యాక్సిడెంట్.. అవన్నీ పుకార్లే..

Update: 2023-05-28 11:22 GMT
రెండేళ్ళ క్రితం రోడ్డు ప్రమాదంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కోమా స్టేజ్ కి వెళ్లి బ్రతికి బయటపడ్డారు. ఇప్పటికి రోడ్డు ప్రమాదం గాయాల నుంచి తేజ్ పూర్తిగా కోలుకోలేదు. ఇలాంటి ప్రమాదాలు నిత్యకృత్యం అయిన సినిమా సెలబ్రిటీలు ప్రమాదాల బారిన పడటం కాస్తా కలవరపెట్టే అంశం అని చెప్పాలి. కొద్ది రోజుల క్రితమే బెంగాల్ కి చెందిన ఓ యాక్టర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్ లో యంగ్ హీరో శర్వానంద్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. శర్వానంద్ ప్రయాణిస్తున్న కారు ఫిల్మ్ నగర్‌ జంక్షన్ దగ్గర అదుపు తప్పింది. తక్షణమే స్పందించిన స్థానికులు సహాయం చేశారు. శర్వానంద్ ని కారులోంచి బయటకి తీసి హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘటనలో శర్వానంద్ కి పెద్దగా గాయాలు కాలేదని తెలుస్తోంది. కారుకి మాత్రం చిన్న గీత పడింది.

ఘటన జరిగిన సమయంలో డ్రైవర్ అక్కడే వున్నారు. చాలా స్వల్ప సంఘటన. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని శర్వానంద్ పీఆర్ టీమ్ నుంచి క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటన శనివారం రాత్రి జరగడంతో తీవ్రస్థాయి ప్రమాదం ఏమో అని అందరూ భావించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం శర్వానంద్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు.

ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. కొన్ని నెలల క్రితం శర్వానంద్ కి ఎంగేజ్ మెంట్ అతని ప్రియురాలు రక్షిత్ రెడ్డితో జరిగింది. ఎంగేజ్ మెంట్ తో మరల శర్వానంద్ సినిమా షూటింగ్ లో బిజీ అయిపోయాడు. దీంతో అతని పెళ్లిపై చాలా ఊహాగానాలు వినిపించాయి. అయితే వారి ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయంట. రాజస్థాన్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ కి ప్లాన్ చేస్తున్నారని టాక్.

వీరి పెళ్లికి కొద్ది రోజులే టైమ్ ఉంది. ఇలాంటి సమయంలో రోడ్డు ప్రమాదం జరగడం అభిమానులు కొంత కలవర పడుతున్నారు. అయితే తీవ్ర గాయాలు కాలేదనే వార్త బయటకి రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. పెళ్లి తర్వాత మరల శ్రీరామ్ ఆదిత్య సినిమా షూటింగ్ లో శర్వానంద్ పాల్గొనే ఛాన్స్ ఉందని టాక్.

Similar News