సందీప్‌ని కూడా బ‌న్నీ ప‌క్క‌న పెట్టేస్తున్నాడా?

అయితే తాజాగా ఈ డైరెక్ట‌ర్‌ని కూడా ప‌క్క‌న పెట్టి మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌ని చేయాల‌ని బ‌న్నీ ప్లాన్ చేసుకుంటున్నాడ‌ట‌.;

Update: 2025-06-13 13:04 GMT
సందీప్‌ని కూడా బ‌న్నీ ప‌క్క‌న పెట్టేస్తున్నాడా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు `పుష్ప 2`తో వ‌చ్చి క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక ద‌శ‌లో ఈ సినిమా ప్రీమియ‌ర్ సంద‌ర్భంగా జ‌రిగిన తొక్కిస‌లాట కార‌ణంగా బ‌న్నీ ఒక రోజు జైలుకు కూడా వెళ్లి రావ‌డంతో `పుష్ప 2` వ‌ర‌ల్డ్ వైడ్‌గా పాపుల‌ర్ అయిన విష‌యం తెలిసిందే. అలాంటి హ్యూజ్ వైర‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌రువాత అంత‌కు మించిన ప్రాజెక్ట్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రావాల‌ని బ‌న్నీ ప్లాన్ చేసుకున్నాడు. అందులో భాగంగానే త‌మిళ క్రేజీ ద‌ర్శ‌కుడు అట్లీ డైరెక్ష‌న్‌లో మెగ్న‌మ్ ఓప‌స్ పాన్ వ‌ర‌ల్డ్ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం తెలిసిందే.

దీపిక ప‌దుకునే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీని స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై క‌ళానిధి మార‌న్ అత్యంత భారీ స్థాయిలో పాన్ వర‌ల్డ్ మూవీగా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వర్క్ జ‌రుగుతోంది. హాలీవుడ్ సూప‌ర్ హీరో సినిమాల‌కు ఏ మాత్రం తీసిపోని స్థాయిని ఈ క్రేజీ ఫిల్మ్‌ని తెర‌పైకి తీసుకురాబోతున్నారు. దీని కోసం హాలీవుడ్‌కు చెందిన ప‌లు వీఎఫ్ ఎక్స్ కంప‌నీలు ప‌నిచేయ‌బోతున్నాయి. మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీతో హాలీవుడ్ స్టాండ‌ర్డ్ టెక్నాల‌జీతో తెర‌పైకి తీసుకురానున్నారు.

ఈ ప్రాజెక్ట్‌కు ముందు త్రివిక్ర‌మ్‌తో భారీ మైథ‌లాజిక‌ల్ మూవీని చేస్తాన‌ని బ‌న్నీ క‌మిట్ కావ‌డం తెలిసిందే. అయితే `పుష్ప 2` క్రేజ్ త‌రువాత బ‌న్నీ మైండ్ సెట్ మార‌డంతో త్రివిక్ర‌మ్ ప్రాజెక్ట్‌ని ప‌క్క‌న పెట్టి అట్లీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం తెలిసిందే. ఇప్పుడు ఇదే త‌ర‌హాలో అల్లు అర్జున్ మ‌రో క్రేజీ డైరెక్ట‌ర్‌కు షాక్ ఇవ్వ‌బోతున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆ డైరెక్ట‌ర్ మ‌రెవ‌రో కాదు సందీప్ రెడ్డి వంగ‌. త‌న‌తో ఓ భారీ సినిమా చేయాల‌ని బ‌న్నీ చాలా రోజులుగా అనుకుంటున్నాడు.

అయితే తాజాగా ఈ డైరెక్ట‌ర్‌ని కూడా ప‌క్క‌న పెట్టి మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌ని చేయాల‌ని బ‌న్నీ ప్లాన్ చేసుకుంటున్నాడ‌ట‌. కార‌ణం ఏంటంటే సందీప్ రెడ్డి వంగ ప్ర‌స్తుతం ప్ర‌భాస్ హీరోగా `స్పిరిట్‌` మూవీని రూపొందిస్తున్నాడు. గ‌త కొంత కాలంగా ప్ర‌భాస్ కార‌ణంగా ఆల‌స్యం అవుతూ వ‌చ్చిన ఈ ప్రాజెక్ట్ ఫైన‌ల్‌గా సెట్స్ పైకి వెళ్ల‌బోతోంది. త్రిప్తి దిమ్రీ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీ త‌రువాత సందీప్ ..ర‌ణ్‌బీర్ క‌పూర్‌తో `యానిమ‌ల్‌` సీక్వెల్ `యానిమ‌ల్ పార్క్‌`ని యొద‌లు పెట్టాల్సి ఉంటుంది.

ఈ రెండు ప్రాజెక్ట్‌లు పూర్త‌యిన త‌రువాతే బ‌న్నీ ప్రాజెక్ట్‌కు బ‌న్నీ టైమ్ కేటాయిస్తార‌ట‌. ఇంత టైమ్ వేచి చూడ‌టం ఇష్టం లేని బ‌న్నీ ఆ స్థానంలో మ‌రో క్రేజీ భారీ సినిమాని చేయాల‌ని ప్లాన్ చేసుకుంటున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇది నిజ‌మైతే బ‌న్నీ నిర్ణ‌యంపై ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News