సూసైడ్ చేసుకున్న లేడీ పోలీసు ఒంటిపై 500 గాయాలు?

కలకలాన్ని రేపిన మహిళా పోలీసు ఆత్మహత్య ఉదంతం ఇప్పుడు అనూహ్య మలుపు తిరిగింది.

Update: 2023-10-22 06:01 GMT

కలకలాన్ని రేపిన మహిళా పోలీసు ఆత్మహత్య ఉదంతం ఇప్పుడు అనూహ్య మలుపు తిరిగింది. ఇప్పటివరకు సదరు పోలీసు కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రచారం జరిగినా.. వాస్తవంలో అందుకు సంబంధం లేని పరిణామాలుచోటు చేసుకున్నాయా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి కారణం.. ఆమె ఒంటి మీద 500లకు పైగా గాయాల గుర్తులు కనిపించటమే.

ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ కు చెందిన మహిళా పోలీసు కానిస్టేబుల్.. తనకు కేటాయించిన వసతిలో ఫ్యాన్ కు ఉరి వేసుకుంటున్న విషయాన్ని గుర్తించి.. ఆమెను రెస్క్యూ చేశారు. ఈ క్రమంలో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. తాజాగా ఆమె డెడ్ బాడీకి పోస్టమార్టం నిర్వహించగా.. ఆమె ఒంటి మీద 500లకు పైగా గాయాలకు సంబంధించిన గుర్తులు ఉన్నట్లుగా గుర్తించారు.

అలీగఢ్ కు చెందిన కానిస్టేబుల్ లో ఆమె ప్రేమలో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే.. అతడు ఆమెను మోసం చేసి వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడని.. ఈ క్రమంలో ఆమె ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వలేదని చెబుతున్నారు. తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె తనను తాను గాయపర్చుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే.. ఎంత ప్రేమ దక్కుంటే మాత్రం.. తనను తాను అంతలా గాయపర్చుకుంటుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉదంతంపై మరింత లోతైన దర్యాప్తు ద్వారానే అసలు విషయాలు వెలుగు చూసే వీలుందన్న మాట వినిపిస్తోంది. తాజాగా వెల్లడైన పోస్ట్ మార్టం రిపోర్టు సంచలనంగా మారింది.

Tags:    

Similar News