Begin typing your search above and press return to search.

కొండపల్లితో క్లారిటీ... వ‌సంత రాజ‌కీయం వెలుగు తగ్గిందా?

By:  Tupaki Desk   |   27 Nov 2021 7:33 AM GMT
కొండపల్లితో క్లారిటీ... వ‌సంత రాజ‌కీయం వెలుగు తగ్గిందా?
X
వంద మాట‌ల క‌న్నా.. ఒక్క ఫొటో చాలు.. అంటారు పెద్ద‌లు. వంద‌ల మాట‌ల్లో చెప్పే భావాన్ని.. ఒక్క ఫొటో ఎలాంటి విశ్లేష‌ణ‌లు చేయ‌కుండానే.. వెల్ల‌డించేస్తుంది. సాధార‌ణంగా ఇలాంటి ప‌రిస్థితి ప్ర‌కృతి విష‌యంలో నో.. క‌థ‌కుల విష‌యంలోనో గోచ‌ర‌మ‌వుతుంది. కానీ.. ఇప్పుడు.. మైల‌వరం వైసీపీ ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ విష‌యంలోనూ వంద మాట‌లు చెప్ప‌ని.. భావాన్ని ఒక్క ఫొటో ప‌లికించింది. గ‌త ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించిన ఆయ‌న‌.. ఈ రెండున్న‌రేళ్ల‌లో ఏమాత్రం ప్ర‌జా సేవ చేశారో ఈ ఫొటో స్ప‌ష్టం చేసింది.

ఇటీవ‌ల కొండ‌ప‌ల్లి పుర‌పాలిక ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా వైసీపీ 14కి, టీడీపీ 15 కౌన్సిల‌ర్లు విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఎంపీ కేశినేని నాని ఓటు కీల‌కంగా మార‌డం.. దీనిపై తీవ్ర వివాదం నెల‌కొన‌డం తెలిసిందే. అయితే.. ఈ వివాదంలో చోటు చేసుకున్న ప‌రిణామాల్లో.. మాజీ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు కీల‌క పాత్ర పోషించారు. టీడీపీ కౌన్సిల‌ర్ల‌ను కాపాడుకోవ‌డం..వైసీపీ ప్ర‌లోభాల జోలికి వారు పోకుండా..చూసుకోవ‌డం వంటి కీల‌క అంశాల‌ను ఆయ‌న జాగ్ర‌త్త‌గా నిర్వ‌హించారు.

చివ‌ర‌కు హైకోర్టు ఆదేశాల‌తో చైర్మ‌న్‌ ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం తెలిసిందే. ఇప్పుడు హైకోర్టు తీర్పు రావాల్సి ఉంది. అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్‌లో వ‌సంత దూకుడు.. ఎలా ఉన్నా.. పార్టీలో కానీ.. ప్ర‌జ‌ల్లోకానీ.. టీడీపీకి వ‌చ్చిన స్పంద‌న రాలేద‌నే చెప్పాలి. ఒక సామాన్యుడు వ్య‌వ‌హరించిన తీరు.. అంద‌రినీ ఆలోచింప జేసింది. మైక్ బాబూ రావు అనే సామాన్యుడు.. ఇక్క‌డ ఎవ‌రి హవా సాగుతోందో.. చిన్న క‌ర‌ప‌త్రం ద్వారా.. చెప్పేశారు. కొండ‌ప‌ల్లి ఖిల్లాకి మ‌హ‌రాజ్ దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు, కొండ‌ప‌ల్లి కోట‌. దేవినేని అడ్డా! అని రాసిఉన్న చిత్రం.. అంద‌రినీ ఆలోచింప‌జేసింది.

సోష‌ల్ మీడియాలో భారీ ఎత్తున వైర‌ల్ కావడం గ‌మ‌నార్హం. అయితే.. వైసీపీలో ఏ ఒక్క‌రూ ఇలా.. చేసింది లేదు. దీనిని బ‌ట్టి.. ఇక్క‌డ ప్ర‌జానాడి మారుతోంద‌నే భావ‌న స‌ర్వ‌త్రా వ్య‌క్తం అవుతుండ‌డం గ‌మ‌నార్హం.