Begin typing your search above and press return to search.

వైసీపీలో రెండుగా చీలిన రెడ్లు.. షాకింగ్ నిజాన్ని చెప్పిన ఏపీ డిప్యూటీ సీఎం

By:  Tupaki Desk   |   29 April 2022 11:56 AM GMT
వైసీపీలో రెండుగా చీలిన రెడ్లు..  షాకింగ్ నిజాన్ని చెప్పిన ఏపీ డిప్యూటీ సీఎం
X
సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. సాధారణంగా వైసీపీ నేతలు ఎవరైనా సరే.. విపక్ష నేత చంద్రబాబునాయుడు ఆయన కుమారుడు లోకేశ్ బాబు మీద సంచలన వ్యాఖ్యలు చేయమంటే వెనుకా ముందు చూసుకోకుండా మాటలు అనేస్తారు.

అదే సమయంలో పార్టీకి సంబంధించిన నేతలపైనా అప్పుడప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. దూకుడు విషయంలో అధికారపక్షమైనా.. విపక్షమైనా ఒకటేలా ఉంటుంది వారి తీరు. తేడా కొడితే చాలు.. సొంత పార్టీ నేతల విషయంలోనూ ఎంతకూ తగ్గని ప్రత్యేకత వైసీపీ నేతల సొంతం.

తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని వైసీపీ నేతల మధ్య లుకలుకలపై ఆయన ఓపెన్ అయ్యారు. వైసీపీలో రెడ్లు రెండు వర్గాలుగా చీలిపోయినట్లుగా ఆయన పేర్కొన్నారు.

రెడ్లు ఏమైనా చేస్తారన్న ఆయన.. వారు లేకపోతే తాను గెలవలేనని చెప్పారు. వైసీపీలో ఉంటూ రెడ్లు రెండు వర్గాలుగా విడిపోవటంతో మధ్యలో దళితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా చెప్పారు. రెడ్ల వర్గ పోరును పక్కన పెట్టి ఒకటిగా ఉండాలన్నారు.

ఆయనీ వ్యాఖ్యలన్ని తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గంగాధర నెల్లూరు ఎంపీడీ కార్యాలయంలో డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ చేసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు వైసీపీ వ్యతిరేక మీడియా సైతం స్మెల్ చేయలేని విషయాన్ని సొంత పార్టీకి చెందిన కీలక నేత బయటపెట్టటం ఇప్పుడు సంచలనంగా మారింది. మరి.. దీనిపై సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.