Begin typing your search above and press return to search.

జ‌న‌సేన వ్య‌వ‌హారాల్లో యంగ్ ప్రొడ్యూస‌ర్

By:  Tupaki Desk   |   19 Feb 2022 9:34 AM GMT
జ‌న‌సేన వ్య‌వ‌హారాల్లో యంగ్ ప్రొడ్యూస‌ర్
X
జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ స్థాపించిన రాజ‌కీయ పార్టీ జ‌న‌సేన‌. సినిమాల్లో న‌టిస్తూనే ప‌వ‌న్ రాజ‌కీయాల్లోనూ కొన‌సాగుతున్నారు. `వ‌కీల్ సాబ్‌` కు ముందు దాదాపు ముడున్న‌రేళ్ల పాటు ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌చ్చారు. ఈ మూవీతో మ‌ళ్లీ స్పీడు పెంచారు. అయితే ఇండ‌స్ట్రీ నుంచి జ‌న‌సేన‌లో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన వారు చాలా త‌క్కువే. ఇదిలా వుంటే ఓ యంగ్ ప్రొడ్యూస‌ర్ మాత్రం జ‌న‌సేన కార్య‌క‌లాపాల‌లో 2019లో ఎల‌క్ష‌న్స్ కి ముందు చురుకుగా పాల్గొన్నారు.

ఆ యంగ్ ప్రొడ్యూస‌ర్ మ‌రెవ‌రో కాదు గీతాఅర్ట్స్ 2 బ‌న్నీవాసు. 2019లో ఎల‌క్ష‌న్స్ కి ముందు జ‌న‌సేన పార్టీ వ్య‌వ‌హారాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆ ద‌శ‌లో ఆయ‌న పాల‌కొల్లు నియోజ‌క వ‌ర్గం నుంచి శాస‌న స‌భ్యుడిగా పోటీకి దిగ‌బోతున్నార‌ని, ఆ కార‌ణంగానే జ‌న‌సేన వ్య‌వ‌హారాల్లో చురుగ్గా పాల్గొంటున్నారంటూ వార్త‌లు వినిపించాయి. అయితే అక్క‌డి నుంచి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చివ‌రి నిమిషంలో వైఎస్సార్ సీపీలో టికెట్ ల‌భించ‌క‌పోవ‌డంతో బ‌య‌టికి వ‌చ్చిన గుణ్ణం నాగ‌బాబుని పోటీ కి దింపారు. దీంతో బ‌న్నీ వాసు క‌న్న క‌ల నిజం కాలేదు.

పాల‌కొల్లులో జ‌న‌సేన నిబెట్టిర గుణ్ణం నాగ‌బాబు ఓట‌మి పాలై మూడ‌వ స్థానంలో నిలిచాడు. ఆ త‌రువాత త‌ను మ‌ళ్లీ వైఎస్సార్ సీపీ గూటికే చేరుకున్నాడు. ఇలా జ‌రిగినా బ‌న్నీవాసు నొచ్చుకోకుండా మ‌ళ్లీ జ‌న‌సేన కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వెస్ట్ గోదావ‌రికి సంబంధించిన పార్టీ కార్య‌క‌లాపాల్లో పాలుపంచుకుంటూ క‌నిపించారు.

ప్ర‌స్తుతం బ‌న్నీవాసు పాల‌కొల్లు లో వున్నారు. ప‌వ‌న్ కల్యాణ్ రేపు న‌ర‌సాపురంలో ఓ ప‌బ్లిక్ మీటింగ్ లో పాల్గొన‌బోతున్నారు. ఈ మీటింగ్ ని ద‌గ్గ‌రుండి బ‌న్నీ వాసు సూప‌ర్ వైజ్ చేస్తున్నార‌ట‌. పాల‌కొల్లుని గ‌తంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో మెగాస్టార్ తేలిక‌గా తీసుకున్నారు. అయితే 2024లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల కోసం సిద్ధ‌మ‌వుతున్న జ‌న‌సేన పార్టీ పాల‌కొల్లు, న‌ర‌సాపురం నియోజ‌క వ‌ర్గాల‌ని ప్ర‌త్యేకంగా తీసుకోబోతోంది. ఈ రెండు నియోజ‌క వ‌ర్గాల‌పై ఈ ద‌ఫా భారీ హోప్ పెట్టుకుంటోంద‌ట‌.

ఈ రెండు నియోజ‌క వ‌ర్గాల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ కు చెందిన స‌మాజిక ఓట‌ర్ల సంఖ్యే ఎక్కువ‌. దీంతో ఈ రెండు నియోజ‌క వ‌ర్గాల‌ని టార్గెట్ గా తీసుకున్న‌ట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్క‌డ టీడీపీకి స్ట్రాంగ్ క్యాండిడేట్ నిమ్మ‌ల రామానాయుడు వున్నారు. అత‌న్ని త‌ట్టుకుని నిల‌బ‌డాలంటే ప‌దునైన ప్యూహంతోనే దిగాల‌ని జ‌న‌సేన భావిస్తోంద‌ట‌. దీనికి యంగ్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు మంత్రాంగం ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తుందో చూడాలి అంటున్నారు.