Begin typing your search above and press return to search.

రావణుడిపై రాముడు విజయం సాధించినట్లు.. కరోనాపై విజయం సాధిస్తాం : బోరిస్‌ జాన్సన్‌

By:  Tupaki Desk   |   15 Nov 2020 12:30 AM GMT
రావణుడిపై రాముడు విజయం సాధించినట్లు.. కరోనాపై విజయం సాధిస్తాం : బోరిస్‌ జాన్సన్‌
X
ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో వున్న భారతీయులు నేడు దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. కరోనా మహమ్మారి విజృంభణతో ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్న నేపథ్యంలో ఆ వైరస్ ను తొలగించాలని ఈ దీపావళి సందర్భంగా తాము కోరుకుంటున్నామని పలు దేశాల నేతలు చెప్పారు. యూకే ప్రధాని బోరిస్‌ జాన్సన్‌తో పాటు ప్రిన్స్‌ చార్లెస్‌ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ తమ సందేశాలను అందించారు. చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని జరుపుకుంటామని వారు అన్నారు. ఈ దీపావళి ప్రజలకు శక్తిమంతమైన సందేశాన్నిస్తోందని ఆయన చెప్పారు.

శ్రీ రాముడు.. రావణుడిపై విజయం సాధించినట్లు చీకటిపై వెలుతురు విజయం సాధించినట్లు, ఎల్లప్పుడూ చెడుపై మంచి గెలుస్తుందని బోరిస్ జాన్సన్ తెలిపారు. మరోవైపు ప్రిన్స్‌ చార్లెస్‌ సైతం దీపావళి విశిష్టతకు కరోనాపై పోరుకు ముడిపెడుతూ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొంటూ ఆనందంగా గడపాల్సిన ఈ సమయాన్ని ఆంక్షల మధ్య జరుపుకోవాల్సిన దుస్థితి తలెత్తిందన్నారు. ఇది నిరాశకు గురిచేసే అంశమైనప్పటికీ.. పండుగ అందించే సందేశంతో స్ఫూర్తి పొందాలన్నారు. కరోనా సంక్షోభ సమయంలో సమాజ సేవకు ముందుకు వచ్చిన యూకేలోని హిందూ, సిక్కు, జైన వర్గాలను ప్రశంసిస్తున్నట్లు తెలిపారు. ఈ పండుగను ప్రతిఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.