Begin typing your search above and press return to search.

సజ్జల సేమ్ టు సేమ్.. మిగతా వైసీపీ నేతల్లానే సమాధానాలు!

ఈ కేసులో విచారణ నిమిత్తం శుక్రవారం ఉదయం 11.30కి గుంటూరు సీఐడీ కార్యాలయానికి సజ్జల రగా, మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఆయనను పోలీసులు ప్రశ్నించారు.

By:  Tupaki Desk   |   10 May 2025 6:10 AM
సజ్జల సేమ్ టు సేమ్.. మిగతా వైసీపీ నేతల్లానే సమాధానాలు!
X

తెలియదు.. గుర్తు లేదు.. మరచిపోయా.. అదుర్స్ సినిమాలో పాపులర్ డైలాగ్ ఇది.. ఇప్పుడు రకరకాల కేసుల్లో ఇరుక్కున్న వైసీపీ నేతల సమాధానం కూడా ఇదేనట.. ఏం ప్రశ్నించినా తమకు తెలియదనే సమాధానంతో పోలీసులకు సవాల్ విసురుతున్నారు వైసీపీ నేతలు. తప్పుడు కేసుల్లో ఇరికించారనే.. తమకు సంబంధం లేదనో కారణంగా చూపి పోలీసుల విచారణకు సహకరించడం లేదని అంటున్నారు. మొత్తానికి వైసీపీ నేతల సమాధానాలతో పోలీసులు కూడా విసిగిపోతున్నారని అంటున్నారు.

వైసీపీ అధికారంలో ఉండగా, మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి తనకేం తెలియదని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఆ సమయంలో తాను ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నానని, టీవీల్లో చూసిన తర్వాతే దాడి విషయం తెలిసిందని సజ్జల చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ కార్యాలయంపై దాడి వెనుక సజ్జల కుట్ర ఉందని ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. గతంలో ఈ కేసుపై పోలీసులు విచారణ జరపగా, ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేయడంతో ఆయనను రెండోసారి ప్రశ్నించారు.

"టీడీపీ కార్యాలయంపై దాడికి వెళ్లాలని నేనెవ్వరినీ ప్రేరేపించలేదు. ఆ సమయంలో ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నా" అని సజ్జల ముక్తసరిగా చెప్పారని అంటున్నారు. అయితే ఆ సమయంలో సజ్జల ఎక్కడున్నది ఆధారాలు సమర్పించాలని పోలీసులు అడగగా, తర్వాత ఇస్తానంటూ సమాధానం చెప్పినట్లు చెబుతున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జల 120వ నిందితుడిగా ఉన్నారు.

ఈ కేసులో విచారణ నిమిత్తం శుక్రవారం ఉదయం 11.30కి గుంటూరు సీఐడీ కార్యాలయానికి సజ్జల రగా, మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఆయనను పోలీసులు ప్రశ్నించారు. సుమారు 27 ప్రశ్నలు అడిగినట్లు చెబుతున్నారు. చాలా ప్రశ్నలకు నా పరిధి కాదు, గుర్తు లేదు. నా అభిప్రాయం చెప్పలేను అంటూ దాటవేసినట్లు చెబుతున్నారు. ఇక ఇదే కేసులో నిందితుడైన విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ చార్జి దేవినేని అవినాశ్ ను సైతం సీఐడీ విచారించింది. ఆయనకు 37 ప్రశ్నలు వేయగా, ఏ ఒక్కదానికీ స్పష్టమైన సమాచారం చెప్పలేదని పత్రికల్లో ప్రచురించారు. దాడి సమయంలో తాను లేనని, తన అనుచరులూ లేరని అవినాశ్ స్పష్టం చేశారని అంటున్నారు.

అయితే విజయవాడ గుణదల నుంచి తాము దేవినేని అవినాశ్ ఆదేశాలతో వైసీపీ కార్యాలయానికి వచ్చామని, అక్కడి నుంచి టీడీపీ కార్యాలయంపై దాడికి వెళ్లామంటూ కొందరు నిందితులు వాంగ్మూలాలిచ్చారని, సీఐడీ ఆ పత్రాలను అవినాశ్ ముందు ఉంచగా, వారు ఎవరో తనకు తెలియదని తప్పించుకున్నట్లు చెబుతున్నారు. అయితే వారిలో కొందరు అవినాశ్ తో కలిసి ఫొటోలు తీయించుకున్నారని సీఐడీ ఆధారాలు చూపితే, ప్రజా జీవితంలో ఉన్న తనతో రోజూ ఎంతో మంది ఫొటోలు తీయించుకుంటారని వారంతా తన అనుచరులు అంటే ఎలా? అని ఎదురు ప్రశ్నించినట్లు చెబుతున్నారు. తమ అధినేతను తిట్టారని టీడీపీ కార్యాలయం ఎదుట ధర్నా చేయడానికి వెళ్లామని, దాడి చేయడానికి ప్రయత్నించలేదని చెప్పినట్లు సమాచారం.