Begin typing your search above and press return to search.

పవన్‌ జాతకంలో లోపం... ఎన్నికలకు ముందు వేణు స్వామి బాంబ్..!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందడి పీక్స్ కి చేరుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ఒకెత్తు అయితే

By:  Tupaki Desk   |   8 May 2024 10:41 AM GMT
పవన్‌ జాతకంలో లోపం... ఎన్నికలకు ముందు వేణు స్వామి బాంబ్..!
X

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందడి పీక్స్ కి చేరుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ఒకెత్తు అయితే.. కొన్ని ప్రత్యేక నియోజకవర్గాలపై మాత్రం విపరీతమైన ఆసక్తి నెలకొంటున్న సంగతి తెలిసిందే. ఆ జాబితాలో టాప్ లో ఉంటుంది పిఠాపురం నియోజకవర్గం! ఇక్కడ నుంచి కూటమి అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు.

ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఎట్టిపరిస్థితుల్లోనూ గెలుస్తారని ఆయన అభిమానులు, జనసైనికులు ధీమాగా ఉన్నారని చెబుతున్నారు. మరోపక్క పవన్ కి ఓటు వేయం అని టీడీపీ నేత వర్మ అభిమానులు చెబుతున్నట్లు కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో... జబర్దస్త్ నటుల నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకూ పలువురు సినీ కళాకారులు పిఠాపురంలో పవన్ కోసం ప్రచారం చేస్తున్నారు.

మరోపక్క... పిఠాపురంలో ప్రజలు స్థానికులకే పట్టం కడతారని.. సీఎం రిలీఫ్ ఫండ్ కాగితంపైనా, చిన్న చిన్న పనులకు సంబంధించిన పేపర్స్ పైనా సంతకాలు కావాలంటే హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితిని కొని తెచ్చుకోరని వైసీపీ నేతలు చెబుతున్నారు. పిఠాపురంలో పవన్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానంటూ ముద్రగడ పద్మనాభం ఛాలెంజ్ లు చేస్తున్నారు.

ఈ స్థాయిలో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు ఎక్కడున్నా అక్కడ పిఠాపురానికి సంబంధించిన చర్చ జరుగుతుందని చెప్పినా అతిశయోక్తి కాదు. ఈ పరిస్థితుల్లో పవన్ కల్యాణ్‌ జాతకంపై వేణు స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వెట్టింట వైరల్ గా మారాయి!

అవును... ఏపీలో పోలింగ్ తేదీకి కౌంట్ డౌన్ మొదలవ్వడం, రాజకీయ వాతావరణం తీవ్రం వేడెక్కడం వంటి కీలక సమయంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. పైగా అవి పవన్ కల్యాణ్ పొలిటికల్ కెరీర్ కు సంబంధించినవి కావడం, అవి కాస్తా నెగిటివ్ గా ఉండటంతో ఆ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ విధంగా ఉన్నాయి. "పవన్ కల్యాణ్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు.. అతడి జాతకంలో అటువంటి యోగం లేదు.. ఇప్పుడే కాదు, ఎప్పటికీ పవన్ కల్యాణ్ సీఎం కాడు" అని వేణు స్వామి చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికల సమయంలో కూడా పవన్ గెలవడని చెప్పినట్లు వేణు స్వామి క్లారిటీ ఇస్తున్నారు!

ఇదే క్రమంలో... "పవన్ కల్యాణ్.. చంద్రబాబు చేతిలో మోసపోవడం ఖాయం" అంటూ మరో బాంబు ప్లేచారు వేణుస్వామి. అందుకు గల కారణాలను వివరిస్తూ... గ్రహాల రిత్యా వీళ్లిద్దరివీ ప్రతికూల ప్రభావం ఉన్న నక్షత్రాలని.. చంద్రబాబుది పుష్యమి నక్షత్రం అయితే పవన్ ది ఉత్తరాషాడ నక్షత్రం అని.. ఈ రెండింటికి అస్సలు పొత్తు కలవదని.. అందుకే వీరి జాతక ప్రభావం వల్ల పొత్తు కూడా పెద్దగా ప్రభావాన్ని చూపే అవకాశం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు!