Begin typing your search above and press return to search.

తల్లి కోసం యంగ్ డాటర్స్ ఎనర్జిటిక్ క్యాంపెయిన్!

సాధారణంగా ఎన్నికల సీజన్ వచ్చిందంటే... ఆయా అభ్యర్థులతో పాటు వారి వారి కుటుంబ సభ్యులు కూడా ప్రచారాల్లోకి దిగుతుంటారు

By:  Tupaki Desk   |   2 April 2024 4:12 PM GMT
తల్లి కోసం యంగ్ డాటర్స్ ఎనర్జిటిక్ క్యాంపెయిన్!
X

సాధారణంగా ఎన్నికల సీజన్ వచ్చిందంటే... ఆయా అభ్యర్థులతో పాటు వారి వారి కుటుంబ సభ్యులు కూడా ప్రచారాల్లోకి దిగుతుంటారు. అయితే ఇటీవల కాలంలో తల్లితండ్రుల కోసం వారి వారి కుమార్తెలు ప్రచార రంగంలోకి దిగడం ఎక్కువగా వినిపిస్తుంది.. పైగా వారి ప్రచార శైలి, ప్రజలను అప్రోచ్ అయ్యే విధానం, చేసే ప్రసంగాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తల్లి కోసం రంగంలోకి దిగిన యంగ్ డాటర్ పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి!!

అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ పేరెంట్స్ కోసం యంగ్ కిడ్స్ ఎంట్రీ వైరల్ గా మారుతుంది. ఏపీలో ఎన్నికల సీజన్ వచ్చేయడం, ఇప్పటికే ఆల్ మోస్ట్ అందరికీ టిక్కెట్లు కన్ ఫాం అయిపోవడంతో, వారంతా ప్రచార కార్యక్రమాలో బిజీ అయిపోయారు. ఇందులో భాగంగా... పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగలపూడి అనిత ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

ఈ సమయంలో ఒక ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. ఒకవైపు అనిత తన ప్రచారాన్ని కొనసాగిస్తుండగా.. మరోవైపు ఆమె తరుపున అనిత చిన్న కుమార్తె రేష్మిత కూడా రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా తన తల్లి తరుపున నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు. పైగా ఆమె ప్రచారం ఆసక్తికరంగా, ఓటర్లను ఆకట్టుకునేలా ఉందని అంటున్నారు.

ఈ విధంగా రేష్మిత పాయకరావుపేట నియోజకవర్గంలో చురుగ్గా పాల్గొంటూ ఓటర్లను ఆకర్షిస్తున్నారని అంటున్నారు. తన తల్లికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈమె చురుకైన ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన కూడా వస్తోందనే కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఫోటోలను టీడీపీ సోషల్ మీడియా జనాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

కాగా... గతేడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ హుజూరాబాద్ బీఆరెస్స్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి తరుపున తన 12 ఏళ్ల కూతురు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఆమె తనదైన క్యూట్ ప్రసంగాలతో అప్పట్లో అందరి దృష్టినీ ఆకర్షించింది. కేసీఆర్ వేదికపై ఉండగా కూడా ఆమె ప్రసగించి ఆకట్టుకోవడం గమనార్హం. ఈ క్రమంలో తాజాగా ఏపీలో వంగలపూడి అనిత తరుపున ఆమె కూతురు రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు!