Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు ప్ర‌తిష్ట వంద రెట్లు పెరిగింది!

''టీడీపీ అధినేత చంద్ర‌బాబును జైల్లో పెట్టి కొన్ని శ‌క్తులు ఆనందం పొందుతున్నాయి. కానీ, జైల్లో ఉన్నా.. చంద్ర‌బాబు ప్ర‌తిష్ట మ‌రింత పెరిగింది

By:  Tupaki Desk   |   30 Oct 2023 4:48 AM GMT
చంద్ర‌బాబు ప్ర‌తిష్ట వంద రెట్లు పెరిగింది!
X

''టీడీపీ అధినేత చంద్ర‌బాబును జైల్లో పెట్టి కొన్ని శ‌క్తులు ఆనందం పొందుతున్నాయి. కానీ, జైల్లో ఉన్నా.. చంద్ర‌బాబు ప్ర‌తిష్ట మ‌రింత పెరిగింది. ఆయ‌న విజ‌న్ ఏంటో.. ఆ శ‌క్తి ఏంటో ఇప్పుడు తెలిసి వ‌స్తోంది'' అని వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ రాజు వ్యాఖ్యానించారు. హైద‌రాబాద్‌లో జ‌రిగిన 'సీబీఎన్ గ్రాట్యిట్యూట్ కాన్స‌ర్ట్‌'కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ ర‌ఘురామ మాట్లాడుతూ.. చంద్ర‌బాబు విజ‌న్ విలువ ఇప్పుడు తెలుస్తోంద‌న్నారు. ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా భారీ సంఖ్య‌లో గ‌చ్చి బౌలి స్టేడియంకు త‌ర‌లి వ‌చ్చిన యువ‌తే దీనికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు.

రాజ‌కీయ కార్యక్ర‌మాల్లో ప్ర‌జ‌ల‌ను, యువ‌త‌ను కూర్చొబెట్టేందుకు కొంద‌రు ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్న ప‌రిస్థితి ఉంద న్న ర‌ఘురామ‌.. తాజాగా జ‌రిగిన కార్య‌క్ర‌మానికి ఇంత పెద్ద సంఖ్య‌లో స్వ‌చ్ఛందంగా త‌ర‌లి వ‌చ్చి కార్య‌క్ర‌మాన్ని జ‌య‌ప్ర‌దం చేయ‌డం గొప్ప విష‌యంగా పేర్కొన్నారు. చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా ఇన్ని గ‌ళాలు జ‌య‌హో అన‌డం ఆశ్చ‌ర్య‌మేమీ లేద‌న్నారు. ఆయ‌న విజ‌న్‌లోని గొప్ప‌ద‌నం ఇదేన‌ని ర‌ఘురామ చెప్పారు. ఇంత పెద్ద కార్య‌క్ర‌మం నిర్వ‌హించుకునేందుకు అనుమ‌తి ఇచ్చిన సీఎం కేసీఆర్‌, పోలీసు ఉన్న‌తాధికారుల‌కు సెల్యూట్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

ఇక‌, ఏపీలో పాల‌న‌పైనా ర‌ఘురామ‌కృష్ణ‌రాజు త‌న‌దైన శైలిలో స‌టైర్లు గుప్పించారు. 'ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో న్యాయానికి ప‌రీక్ష జ‌రుగుతోంది. అక్క‌డ తుమ్మినా ద‌గ్గినా కేసు పెడుతున్నారు. బాధితుల‌పై క‌క్ష‌సాధింపు రాజ‌కీయం చేస్తున్నారు. అయితే.. దేవుడు ఎప్పుడూ ఉన్నాడు. న్యాయానికి అన్యాయం జ‌రిగితే.. సుప్రీంకోర్టులో త‌ప్ప‌కుండా న్యాయం గెలుస్తుంది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌ప్ప‌కుండా సంపూర్ణ‌ ఆరోగ్యంగా జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌స్తారు. అప్పుడు సంతోష‌క‌ర‌మైన దీపావ‌ళిని చేసుకుందాం'' అని ర‌ఘురామ అన్నారు.