Begin typing your search above and press return to search.

పిఠాపురంలో గెలుపు నాదే: ప‌వ‌న్‌

పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో గెలుపు త‌న‌దేన‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ మ‌రోసారి భ‌రోసా వ్య‌క్తం చేశారు

By:  Tupaki Desk   |   9 April 2024 9:38 AM GMT
పిఠాపురంలో గెలుపు నాదే:  ప‌వ‌న్‌
X

పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో గెలుపు త‌న‌దేన‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ మ‌రోసారి భ‌రోసా వ్య‌క్తం చేశారు. తెలుగు నూత‌న సంవ‌త్స‌రాదిని పుర‌స్క‌రించుకుని పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలోని చేబ్రోలు గ్రామంలో నూత‌నంగా అద్దెకు తీసుకున్న ఇంట్లో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. రెండు రోజుల కింద‌ట ఈ ఇంటిని స్థానిక రైతు ఒక‌రు ప‌వ‌న్ కోసం కేటాయించిన విష‌యం తెలిసిందే.

ఈ ఇంట్లో క్రోధినామ సంవ‌త్స‌ర ఉగాది ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ప‌వ‌న్‌.. గృహ ప్ర‌వేశం చేశారు. ఈ కార్యక్ర‌మంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయ‌కుడు, స‌త్య‌నారాయ‌ణ వ‌ర్మ దంప‌తులు, నాగ‌బాబు స‌హా కొద్ది మంది జ‌న‌సేన నాయ‌కులు పాల్గొన్నారు. ప్రత్యేక పూజ‌లు, పంచాంగ ప‌ఠ‌నం పూర్త‌య్యాక‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న పార్టీ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. క్రోధి నామ సంవ‌త్స‌రంలో రాష్ట్ర ప్ర‌జ‌లకు మేలు జ‌ర‌గాల‌ని కోరుకుం టున్న‌ట్టు చెప్పారు.

అదేవిధంగా ఈ సంవ‌త్స‌రంలో కూట‌మి ప్ర‌భుత్వం రాష్ట్రంలో గ‌ద్దెనెక్క‌డం ఖాయ‌మ‌ని చెప్పారు. పిఠా పురంలో త‌న గెలుపును ఎవ‌రూ ఆప‌లేర‌న్న ఆయ‌న‌.. ప్ర‌జ‌ల నాడి మార్పుదిశ‌గా అడుగులు వేస్తోంద‌న్నా రు. ఈ ఏడాది ప్ర‌జ‌ల‌కు మేలు జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నాన‌ని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధికి ఈ కొత్త సంవ‌త్స‌రం పునాదులు వేస్తుంద‌న్నారు. కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డుతుంద‌ని.. కొత్త నాయ‌క‌త్వంలో రాష్ట్రం పురోభివృద్ధిలో ముందుకు సాగుతుంద‌ని తెలిపారు.