Begin typing your search above and press return to search.

ఒకే ఫ్రేం లో అన్న గారి కుటుంబం...ఏపీ పాలిటిక్స్ లో బిగ్ ట్విస్ట్!

కుటుంబం అంటే అన్న గారిదే. ఆయనది జగమంత కుటుంబం. వారంతా ఇపుడు మనవలు మనవరాళ్ళతో కళకళలాడుతున్నారు

By:  Tupaki Desk   |   24 Aug 2023 4:05 AM GMT
ఒకే ఫ్రేం లో అన్న గారి కుటుంబం...ఏపీ పాలిటిక్స్ లో బిగ్ ట్విస్ట్!
X

కుటుంబం అంటే అన్న గారిదే. ఆయనది జగమంత కుటుంబం. వారంతా ఇపుడు మనవలు మనవరాళ్ళతో కళకళలాడుతున్నారు. నందమూరి అన్నది అటు సినీ రంగానికి ఇటు రాజకీయ రంగానికి ఒక బ్రాండ్ గా ఉంది. 2024 ఎన్నికల ముందు అన్నగారి కుటుంబం అంతా ఒక్కటిగా ముందుకు వస్తుంది అని అంటున్నారు. అయితే దాని కోసం తెర వెనక ప్రయత్నాలు గతంలో జరిగినా పెద్దగా ఫలితాలు ఇవ్వలేదు.

ఈ ఏడాది మే 28తో ముగిసిన అన్న గారి శతజయంతి ఉత్సవాలలో జూనియర్ ఎన్టీయార్ పాలుపంచుకుంటారు అని అనుకున్నా ఆయన విదేశాలకు వెళ్ళిపోయారు. దాంతో ఒక అరుదైన దృశ్యం ఆవిక్ష్కరణ జరగలేదు. ఇపుడు మాత్రం ఒకే ఫ్రేం లో గ్రూప్ ఫోటోతో అన్న గారి ఫ్యామిలీ సందడి చేయనుంది.

త్వరలో రాష్ట్రపతిభవన్ లో ఎన్టీయార్ శతజయంతిని పురస్కరించుకుని వంద రూపాయల నాణాన్ని ఆయన బొమ్మతో ముద్రించినది విడుదల చేయనున్నరు. ఈ కార్యక్రమాన్ని కేంద్రం గ్రాండ్ లెవెల్ లో నిర్వహిస్తోంది. ఇక ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా అన్న గారి కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి ఉన్నారు. దాంతో ఎన్టీయార్ ఫ్యామిలీతో పాటు ఆయనతో సన్నిహితంగా ఉన్న వారిని కలుపుకుని మొత్తం వంద మంది దాకా ఈ వేడుకకు ఆహ్వానించారు అని తెలుస్తోంది.

దీంతో ఢిల్లీ వేదికగా అన్న గారి కుటుంబం అంతా కలవనుంది అని అంటున్నారు ఈ వేడుకకు జూనియర్ ఎన్టీయార్ తో పాటు కళ్యాణ్ రామ్, నందమూరి బాలయ్య ఇతర ఫ్యామిలీ మెంబర్స్ అంతా వస్తారని అంటున్నారు. ఇక టీడీపీ తరఫున అధినేత చంద్రబాబు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తం అంతా కలసి పంచుకునే ఈ వేడుక ఏపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ గా మారనుంది అని అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో పార్టీ ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ ని బరిలోకి దించాలన్నది ఒక వ్యూహంగా ఉంది. అయితే ఇప్పటిదాకా జూనియర్ అయితే దూరం పాటిస్తున్నారు. కానీ ఇపుడు ఆయన టోటల్ ఫ్యామిలీతో కలసిపోతూ ఉత్సాహంగా ఉల్లాసంగా సందడి చేసిన వేడుక రెండు రోజుల క్రితమే జరిగింది. నందమూరి హరిక్రిష్ణ కుమార్తె సుహాసిని కుమారుడి పెళ్ళి వేడుకల జూనియర్ ఎన్టీఆర్ తో పాటు బాలయ్య, ఆయన కుమారుడు మోక్షజ్ఞ అంతా హాజరై పరస్పరం ప్రేమతో పలకరించుకున్నారు. ప్రియమైన అన్నయ్య అంటూ మోక్షజ్ఞ కూడా ఆ ఫోటోలను సోషల్ మీడియాతో పంచుకున్నారు.

దీంతో ఈ ఫ్యామిలీ అంతా ఒక్కటిగా ముందుకు రాబోతోంది అన్న సంకేతాలు అయితే బయటకు వచ్చాయి. దానికి మరో అడుగు ఢిల్లీలో అన్న గారి బొమ్మతో వెండి నాణెం ఆవిష్కరణ. రేపటి రోజున ఏపీలో బీజేపీ టీడీపీ పొత్తులు పెట్టుకుంటాయని భావిస్తున్న నేపధ్యం ఉంది. ఎన్టీఆర్ పేరుని లెగసీని బీజేపీ కూడా వాడుకోవాలని చూస్తోంది. దాంతో అన్న గారి ఫ్యామిలీకి అత్యంత విలువ గౌరవం ఇస్తోంది. సో ఏ విధంగా చూసిన అన్న గారి కుటుంబం ఒక్కటిగా వస్తే మాత్రం ఏపీ పాలిటిక్స్ లో భారీ మార్పులే చోటు చేసుకుంటాయని అంటున్నారు.